పాకిస్థాన్‌లో ధురంధర్ దూకుడు.. బ్యాన్ చేసినా కూడా ఓటీటీలో ఎగబడి చూస్తున్నజనం, కారణం ఏంటి?

Published : Feb 04, 2026, 01:26 PM IST

ధరుంధర్ సినిమా దూకుడు ఇంకా తగ్గలేదు. బ్యాన్ చేసిన చోట కూడా హవా చూపిస్తూ.. రెచ్చిపోతోంది మూవీ. పాకిస్తాన్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాక్ జనాల చేత కూడా సూపర్ అనిపించుకుంటోంది మూవీ. వివరాల్లోకి వెళ్తే..? 

PREV
15
నెట్‌ఫ్లిక్స్ లో దుమ్మురేపుతోన్న సినిమా..

రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' థియేటర్లలో భారీగా సంపాదించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, థియేటర్ రిలీజ్ సమయంలో పాకిస్థాన్‌లో స్క్రీనింగ్ దొరకని ఈ సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. డిజిటల్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అక్కడి ప్రేక్షకుల్లో దీనిపై విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.

25
పాకిస్థానీ ప్రేక్షకుల పాజిటివ్ రియాక్షన్

సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు యూజర్లు సినిమాను మెచ్చుకుంటున్నారు. సినిమాలో మంచి రీసెర్చ్ కనిపిస్తోందని, పాత్రలను మూస పద్ధతిలో చూపించలేదని కొందరు ప్రేక్షకులు అన్నారు. మరికొందరు దీన్ని 'ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత శక్తివంతమైన బాలీవుడ్ సినిమాల్లో ఒకటి' అని కూడా అన్నారు. అయితే, సినిమాలోని రాజకీయ కోణంపై చర్చ జరుగుతున్నా, ప్రేక్షకుల్లో ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో దీని వ్యూయర్‌షిప్ వేగంగా పెరుగుతోంది.

35
బాక్సాఫీస్ వద్ద ధురంధర్ అద్భుతం

ఈ సినిమా ఇప్పటికే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన చేసింది. రిపోర్ట్  ప్రకారం, మిడిల్ ఈస్ట్, పాకిస్థాన్‌లో రిలీజ్ కాకపోయినా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్ల రూపాయలు సంపాదించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాక పాకిస్థాన్‌లో దీనికి వస్తున్న ఆదరణ చూస్తుంటే, అక్కడి ప్రేక్షకులు కూడా సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారని అర్థమవుతోంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యి ఉంటే.. కలెక్షన్లు భారీగా పెరిగి ఉండేవి అటి టాక్.

45
ధురంధర్ గురించి ఇంత చర్చ ఎందుకు?

ధురంధర్ ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ శత్రువుల నెట్‌వర్క్‌లోకి చొరబడే భారతీయ ఏజెంట్ పాత్రలో నటించారు. కథలో నిజ జీవిత ఘటనల స్ఫూర్తి, కల్పన కలగలిపి ఉండటం ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాలో కేవలం ఒక దేశాన్ని విలన్‌గా చూపించకుండా, సంక్లిష్టమైన రాజకీయ, నేర ప్రపంచంలోని పొరలను కూడా చూపించారు. అందుకే దీనిపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

55
ధురంధర్ సీక్వెల్‌పై పెరిగిన అంచనాలు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ మేకర్స్ ఇప్పటికే దీని సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ సినిమా ‘ధురంధర్ : ది రివెంజ్’ పేరుతో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ‘ధురంధర్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతుండటంతో, తర్వాతి భాగంపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ‘ధురంధర్’లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్ లాంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories