స్టార్ హీరో ధనుష్ త్వరలో ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్లో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు వైరల్ గా మారాయి.
14
అబ్దుల్ కలాం బయోపిక్
మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ త్వరలో రూపొందనుంది. ధనుష్ కలాం పాత్రలో నటించబోతున్నాడు. 'కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్తో ఈ సినిమా రానుంది. టీ-సిరీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
24
దర్శకుడు ఎవరు?
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఆదిపురుష్ సినిమా తీశారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.
34
ధనుష్ కుబేరా
ధనుష్ నటించిన కుబేరా జూన్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక కూడా నటించారు.
ఇళయరాజా బయోపిక్, మారి సెల్వరాజ్, విఘ్నేష్ శివన్, వెట్రిమారన్ సినిమాల్లో ధనుష్ నటిస్తున్నారు. బాలీవుడ్లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తెరే ఇష్క్ మే' అనే హిందీ సినిమాలో కూడా నటిస్తున్నారు.