Devatha: సత్యకు మాటిచ్చిన దేవుడమ్మ... వాళ్ల నాన్నను కలవడానికి వెళ్ళిన దేవి!

Published : Aug 31, 2022, 01:45 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 31వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...  

PREV
17
Devatha: సత్యకు మాటిచ్చిన దేవుడమ్మ... వాళ్ల నాన్నను కలవడానికి వెళ్ళిన దేవి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య, దేవి దగ్గరకు వెళ్తాడు దేవి ఆదిత్యను చూసి ఏడ్చుకుంటూ వచ్చి హద్దుకుంటుంది ఏమైంది అని ఆదిత్య అడగగా నేను మా నాయనను కలిసాను ఒక్కరే పాపం సరైన ఇల్లు కూడా లేకుండా ఉంటున్నారు. అమ్మకి మాట్లాడమని చెప్తే మాట్లాడడం లేదు అని అనగా మీ అమ్మ మాట్లాడట్లేదు అంటే ఏదైనా కారణం ఉండి ఉంటుంది కదా అని ఆదిత్యా అంటాడు. దానికి దేవీ అమ్మని ఒకప్పుడు నాయన తాగి కొట్టేవాడు. దానికి అమ్మ ఇప్పుడు కూడా బాధ పెడతాడేమో అని భయంతో మాట్లాడటం లేదు.
 

27

 కానీ నేను మా నాయనను వదులుకోలేను అని అంటుంది. అప్పుడు ఆదిత్య నాకు దక్కవలసిన ప్రేమ ఎవరికో దక్కుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను ఇదెక్కడి కర్మ అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో భాగ్యమ్మ రుక్మిణి దగ్గరికి వెళ్లి, నువ్వు వాడిని కొట్టడం కాదు నాకు చెప్తే వెళ్లి వాడి తల నరికి వస్తాను నాలుగేళ్లు జైల్లో ఉన్న పర్లేదు నాకు కూడు ఉంటే చాలు ఎక్కడుంటే ఏంటి అని అంటుంది.నువ్వేంటి అమ్మ నేను కూడా ఆ పని చేయగలను అనగా నువ్వు చేయగలవు కానీ నువ్వు చేయవు అందుకే మాధవ్ అలా రెచ్చిపోతున్నాడు అని అంటుంది. 
 

37

నేను ఆయన ముఖం చూసి కాదు చిన్మయి మొఖం చూసి ఏమీ అనట్లేదు అని అనగా వాడి బిడ్డ కోసం నువ్వెందుకు అలా తాపత్రయపడుతున్నావు అని భగ్యమ్మ అడుగుతుంది.అప్పుడు రుక్మిణి,నేను దేవిని ఎలా పెంచానో చిన్మయిన కూడా అలాగే పెంచాను ఇద్దరికీ ఒకే ప్రేమను అందించాను. చిన్నయి  అమ్మ చనిపోయిన సరే నేను చిన్మయికి చిన్నప్పుడు నుంచి తల్లి పాత్ర పోషించాను అలాగని దానికి నేను అన్యాయం చేయలేను మాధవ్ సార్ కూడా ముందు బానే ఉండేవాడు ఇప్పుడిలా తయారయ్యారు మనం మార్చుకుందాము.అంతకుమించి చంపడాలు నరికేడాలో వద్దు అని అంటుంది.

47

 ఆ తర్వాత సీన్లో సత్య కమల బిడ్డని లాలిస్తూ ఆడుకుంటుంది. ఇంతలో కమల దాన్ని చూసి నువ్వు కూడా అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా సత్య ఎంత ఆనందంగా ఉన్నావో పిల్లలను చూస్తేనే అనగా ఆదిత్య ఒప్పుకోవడం లేదు అక్క నేను ఏం చేయగలను ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు ఈసారి కూడా అమెరికా వెళ్లడం అవుతదో లేదో అని బాధపడుతూ ఉంటుంది. అంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి,ఆదిత్య నీతో అమెరికా వెళుతున్నాడు వెళ్లేలా నేను చేస్తాను. నీకు కూడా మంచి బిడ్డలు పుడతారు అని దేవుడమ్మ హామీ ఇస్తుంది.
 

57

ఆ తర్వాత సీన్లో చిన్మయి  స్కూల్ నుంచి బయటికి వస్తుంది దేవి ఏది అని రుక్మిణి అడగగా వాళ్ళ నటనని కలవడానికి వెళ్ళింది అని చెప్తుంది. అప్పుడు రుక్మిణి వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్లి దేవి వాళ్ళ నాన్నను కలవడానికి వెళ్ళింది అని చిన్మయి చెప్పింది అది ఎక్కడికి వెళ్ళుంటాదో అని భయపడుతూ ఆదిత్య నీ అడగగా నేను ఇది ఊహించాను అందుకే దేవికి నేను ఒక వాచ్ ఇచ్చాను. అది GPS చూపిస్తుంది.దేవి ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది అని అంటాడు. అయితే దేవి గురించి భయపడాల్సిన అవసరం లేదు కదా నీ మీద నమ్మకంతోనే నేను ఇంటికి వెళ్తున్నాను పెనిమిటి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

67

 ఆ తర్వాత సీన్ లో దేవుడమ్మ రుక్మిణి ఫోటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వెనకాతల నుంచి సత్య కమలలు చూసి అక్కంటే మీకు ఎంత ప్రేమ! అని అంటారు.అప్పుడు దేవుడమ్మ,ఎంత ప్రేమున్న నా దగ్గరికి ఎందుకు రావడం లేదు. బతికే ఉన్నాదని తెలుసు కానీ నా దగ్గరికి రావడానికి రుక్మిణి ఏం ఆపుతుంది.సత్య ,కమల మీరు చెప్పండి నేను నాకు తెలియకుండా రుక్మిణికి ఏవైనా హానిచేసేనా లేకపోతే దాన్ని బాధపెట్టేది ఏవైనా చేశానా మరి నా దగ్గరికి రావడానికి ఎందుకు సంకోచిస్తుందో అని బాధపడుతూ ఉంటుంది.
 

77

ఆ తర్వాత సీన్లో ఆ బిచ్చగాడికి దేవి మంచినీళ్లు ఇచ్చి మందులు వేసి పడుకోబెడుతుంది.నువ్వు ఇక్కడ ఉంటే చాలా బాగుందమ్మా. అలాగే రాదని కూడా తీసుకొచ్చి ముగ్గురం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు అప్పుడు దేవి బాధపడుతూ ఉంటుంది   ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తుంది.ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories