పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ కి దిగుతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే చివరకి పూరి జగన్నాధ్ పసలేని కథతో విసుగు పుట్టించాడు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.