Yellamma: ఎల్లమ్మ ఫస్ట్ లుక్, దేవీశ్రీని కంప్లీట్ గా మార్చేశారు.. పెద్ద ప్లానే ఇది, మరో రెండు సర్ప్రైజ్ లు

Published : Aug 02, 2026, 06:00 PM IST

దేవిశ్రీ ప్రసాద్ 47వ పుట్టినరోజు సందర్భంగా ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పర్షి పాత్రలో డీఎస్పీ రస్టిక్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

PREV
15
ఎల్లమ్మ ఫస్ట్ లుక్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు ఈ ఆదివారం ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. ఆయన 47వ పుట్టినరోజు సందర్భంగా పలువురు దర్శకులు, నిర్మాతలు తమ కొత్త చిత్రాలకు డీఎస్పీ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ‘ఎల్లమ్మ’ చిత్రబృందం మరింత ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఇస్తూ, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

25
కంప్లీట్ గా మారిపోయిన దేవిశ్రీ

చిత్రబృందం డీఎస్పీని ‘పర్షి’ పాత్రలో పరిచయం చేసింది. ఈ పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ రస్టిక్ అవతార్‌లో కనిపిస్తున్నారు. భుజాల వరకు ఉండే పొడవాటి జుట్టు, పాతకాలపు గెటప్‌తో పాటు గ్రామీణ నేపథ్యంలో అలంకరించిన కిరీటాన్ని చేతిలో పట్టుకుని కనిపించడం ఆకట్టుకుంటోంది. దర్శకుడు వేణు యెల్దండి ఈ సినిమా కోసం సృష్టించిన గ్రామీణ ప్రపంచాన్ని ఈ ఫస్ట్ లుక్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ లో దేవిశ్రీ ప్రసాద్ ని కంప్లీట్ గా మార్చేశారు. ఆ క్రెడిట్ డైరెక్టర్ వేణుకే చెందుతుంది. బలగం తర్వాత వేణు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. చూస్తుంటే ఏదో భారీ స్థాయిలోనే వేణు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు.

35
ఆసక్తి పెంచుతున్న బిజీయం

ఫస్ట్ లుక్ గ్లింప్స్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్‌లో కనిపించే వాతావరణానికి తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించినప్పటికీ, పాత్రకు సంబంధించిన కీలక వివరాలను మాత్రం మేకర్స్ గోప్యంగానే ఉంచారు. ఫస్ట్ లుక్ మినహా సినిమా గురించి ఇతర విషయాలను ఇంకా వెల్లడించలేదు.

45
దిల్ రాజు నిర్మాణంలో..

‘బలగం’ చిత్రంతో గుర్తింపు పొందిన వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

55
మరో రెండు బిగ్ సర్ప్రైజ్ లు

దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే కావడంతో ఎల్లమ్మతో పాటు మరో రెండు భారీ సర్ప్రైజ్ లు కూడా అభిమానులకు అందాయి. కింగ్ నాగార్జున 100 చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కంఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మాస్, కింగ్, మన్మథుడు లాంటి నాగార్జున సూపర్ హిట్ చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఇప్పుడు కెరీర్ లో మైలురాయి లాంటి 100 చిత్రానికి కూడా దేవిశ్రీపైనే నాగ్ నమ్మకం ఉంచారు. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హీరో కార్తీ 30వ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా ఖరారు అయ్యారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.

Read more Photos on
click me!

Recommended Stories