అప్పుడు దేవి సంతోషంతో ఆదిత్యతో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటుంది. దేవి ఆనందంతో వెళ్లి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, రాధ ఇద్దరు దీపాలు వెలిగిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ వస్తాడు. తర్వాత రాద,ఆదిత్య ఇద్దరు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. మరొకవైపు మాధవ సత్య కి ఫోన్ చేసి గుడిలో జరిగిన విషయం మొత్తం వివరించడంతో సత్యసాక్ అవుతుంది. అప్పుడు సత్య నాకు ఫోన్ చేసి బాధపడకపోతే నువ్వే వెళ్లి నిలదీయొచ్చు కదా అని అనగా ఇది గుడి కథ సత్యా నలుగురిలో నిలదీస్తే నా పరువే పోయేది అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు మాధవ.