Guppedantha Manasu: దేవయానిని హేళన చేసిన మహేంద్ర.. వసుధార కిడ్నాప్ సీన్ పై రిషి ఆరా?

First Published Sep 3, 2022, 8:52 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసుకి చాలా మత్తుగా ఉండి, పరీక్ష అయలేకపోతుంది.అప్పుడు రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసు,ధైర్యం తెచ్చుకొని నేనెలాగనే పరీక్ష రాయాలి అని పరీక్ష రాస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న జగతి, మహీంద్రా, రిషి వసు పరీక్ష రాయగలుగుతుంది అని ఆనందపడతారు. ఆ తర్వాత సీన్లో జగతి మహీంద్రాలు రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.ఒక రాత్రి అంతా నరకం చూసాను అనుకో ఒక వైపు  వసు ఎలాగున్నాది అని, ఇంకొక వైపు పరీక్ష రాయగలుగుతుందో లేదో అని కానీ ఆఖరికి రాసింది అదే చాలు అని అనుకుంటారు.
 

అప్పుడు మహీంద్రా, అయినా వసుధారకి ఏమైంది?ఏమైనా చెప్పిందా అని అడగగా వాళ్ళు చెప్పేంతవరకు మన ఊహల్లో కి వెళ్లిపోవడం మంచిది కాదు వాళ్ళంతటి వాళ్ళే చెప్తారు అని అనుకుంటారు. కానీ దీనికి దేవయాని అక్కయ్య కి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు. అంకుల్, ఆంటీ ఎలాగైనా రిషి, వసుధర లకు పెళ్లి చేసేయాలి,మనమే దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేయాలి ఆ బాధ్యత మన మీదే ఉంది అని అనుకుంటారు. రెస్టారెంట్ కి వచ్చి ఇంత సేపైనా వసు రాలేదు ఏంటి అని వెయిటర్ నీ అడగగా ఈరోజు వసుధార సెలవు అని చెప్పారు.
 

ఇక్కడ వసు లేదు,అక్కడ రిషి లేదు ఇది తేడా గ ఉందే అని గౌతమ్ అంటాడు,అదే సమయంలో,వసు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లాడితో ఆడుకుంటూ ఉంటుంది.అక్కడికి రిషి వస్తాడు అప్పుడు వసు రిషి చేయ పట్టుకొని ఆడుతూ తిప్పుతుంది.ఏమైంది వసుధార,అని రిషి అడగగా పరీక్షలు అయిపోయాయి కదా సార్ చాలా ఆనందంగా ఉన్నాను ఇంకా ఏ భారము ఉండదు అని అనుకుంటుంది వసు. అప్పుడు రిషి, అసలు ఏమైందని కంగారుపడుతూ ఉంటావు అనుకోని వస్తే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అసలు ఏమైంది చెప్పు అని అంటాడు.
 

ఎవరో నాకు మత్తు మందు ఇచ్చారు సార్ అని చెప్పింది. వసుధార నీకు వాళ్ళు ఎవరో గుర్తున్నారా? అని అడగగా వసు మనసులో సాక్షి ఏ  ఈ పని చేసి ఉంటుంది, అసలు ఏం చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఈయనకి సాక్షి గురించి చెప్తే ఏం చేస్తారో నేనే తనతో తెలుసుకుంటాను అని అనుకోని బయటికి మాత్రం తెలీదు సార్ అని చెప్తుంది. గుర్తు తెచ్చుకో వసు ఏవైనా  తెలుస్తుంది ఏమో అని అనగా ఇంక ఈ సంఘటన గుర్తు చేసుకోవాలని లేదు సార్ అని అంటుంది వసు. సరే నువ్వు బాధ పడొద్దులే ప్రస్తుతానికి దీన్ని వదిలేద్దాం. నేను ఒక చోటికి తీసుకెళ్తాను పదా అని వసుని ఎక్కడికో తీసుకెళ్తాడు రిషి. ఆ తర్వాత సీన్లో మహేంద్ర, వసు, రిషిల ఫొటోలను ఎడిటింగ్ చేసి ఒక ఫోటోగా చేస్తాడు.
 

అక్కడున్న గౌతమ్, జగతి, ధరణి లు ఆ ఫోటోలు చూసి వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుని మురిసిపోతారు. అప్పుడు ఈ సమయంలో దేవయాని అత్తయ్య ఏం చేసి ఉంటారో అని  ధరణి అడగగా సాక్షి రిషిల పెళ్లి జరగలేదు అని చెప్పి మాడు ముఖంతో ఒక మూల నేర్చుకుంటూ ఉంటారు అని అంటాడు మహేంద్ర. ఈ మాటలని చాటున దేవయాని వింటుంది అసలు సాక్షి కి బుద్దే బాగుంటే నా పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఒక పని ఎలా సక్రమంగా చేయాలో కూడా తెలియదు అని అనుకుంటుంది. ఇంతలో సాక్షి ఫోన్ చేస్తుంది.
 

నువ్వు నాతో మాట్లాడొద్దు సాక్షి , కనీసం ఒక పనిని చేయలేకపోయావు అని అనగా చివరి నిమిషంలో రిషి అక్కడికి వస్తాడని మాకు మాత్రం ఏం తెలుసు పోనీలెండి మనం అనుకునే లక్ష ప్రయత్నాల్లో ఒకటి విఫలమైంది ఇంకా చాలా ఉన్నాయి కదా. నా మీద నమ్మకం ఉంచండి అని అంటుంది సాక్షి. అప్పుడు దేవయాని నీ నోటి మాటలు చేతి వరకు వెళతాయి అని నాకు నమ్మకం లేదు సాక్షిని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు సాక్షి, ఈవిడ ఏదో నన్ను సాసిస్తున్నట్టు అనుకుంటుంది. అయినా నా ప్లాన్ వేరు రిషి ఎవరికి దక్కకూడదు అలా నేను చేస్తాను అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!