Guppedantha manasu: రిషీ నీవాడు.. సాక్షిని మళ్లీ రెచ్చగొడుతున్న దేవయాని.. అదే సోది స్టార్ట్!

First Published Aug 20, 2022, 9:06 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి బోర్డు మీద ఒక క్వశ్చన్ రాసి వసుని దానికి జవాబు రాయమని చెప్పాడు. కానీ  వసు బోర్డు మీదకి వెళ్లి ఉంగరం కొనడం కోసం లెక్కలు వేసుకుంటుంది. ఏం చేస్తున్నావ్ వసుధారా అని రిషి అడగగా ఏమీ లేదు అని చెరిపేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు తిడితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని రిషి మనసులో అనుకోని వెళ్లి కూర్చొ అని అంటాడు. వసుధారా నవ్వుతూ వెళ్తుంది. ఈరోజు వసుధార ఏంటి ఇలా ఉంది అని అనుకుంటాడు రిషి.ఆ తర్వాత సీన్లో జగతి, మహీంద్ర, గౌతమ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
 

అప్పుడు మహేంద్ర, ఈ మధ్య నాకు కారు నడపడం బాగా నచ్చుతుంది ముఖ్యంగా ఈరోజు అని అంటాడు. ఇంతట్లో గౌతమ్ ఈరోజు రిషి మూడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని అనగా మహేంద్ర, రిషిని ఆటపటిస్తూ మాట్లాడుతాడు తన మూడ్  ఈ రోజు కొంచం చిరుజల్లు పడొచ్చు కోపంగా ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు జగతి నేను చెప్పనా రిషి మూడ్ ఎలా ఉంటుందో ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకి వస్తున్నాయి కాబట్టి కంగారుగా ఉండుంటారు.మనం కూడా వెళ్లి రిషికి సహాయం చేయాలి అని అంటుంది. అంతట్లో వసు అటువైపు నుంచి నడుస్తూ వెళ్తుంది.
 

గౌతమ్ వసుధారని పిలిచినా సరే వసుధార ఆలోచనలలో పడిపోయి వీళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో రిషి కాలేజ్ స్టాఫ్ అందరితోని పరీక్షలు గురించి మీటింగ్ పెడతాడు. అక్కడ చదువు గురించి మాట్లాడి ప్రతి ఒక్కరికి ఎక్కువ మార్కులు రావాలి అని మనం బలవంతం పెట్టలేము ఎవరు చదువు వాళ్ళది కానీ వాళ్ళ పరంగా వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకొనేలా చూసుకోవాలి అని అనుకుంటారు.మీటింగ్ అంతటితో అయిపోతుంది. అప్పుడు రిషి జగతిని పిలిచి మేడం ఈ మధ్య వసుధార ఎందుకు చదువు మీద ధ్యాస పెట్టడం లేదు.
 

పరీక్షలు వస్తున్నాయి కదా జాగ్రత్తగా చదవమని చెప్పండి అని అంటాడు.అప్పుడు జగతి, తను యూత్ ఐకాన్, కాలేజీ గౌరవం కాకుండా కనుక్కోవడం ఒక సగటు ఆడ మనిషి కదా తనకి ఫీలింగ్స్ ఉంటాయి అని అంటుంది జగతి. ఆ తర్వాత సీన్లో, గౌతమ్ వసుతో మాట్లాడి వస్తాడు. మహేంద్ర, వసు ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు.మనకు రిషి మనసే కాదు వసుధార మనసు కూడా అర్థం కావట్లేదు అని గౌతమ్ అంటాడు. జగతి అప్పుడే మహేంద్ర దగ్గరికి వస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోగ రిషి, నేను అప్పుడే రాను నాకు పనున్నది మీరు వెళ్ళండి అని అంటాడు.
 

అప్పుడు రిషి వసుధార ఎందుకు ఇలా ఉంది ఒకసారి రెస్టారెంట్ కి వెళ్లి చూద్దాము అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో దేవయాని సాక్షి ఇద్దరూ కలుస్తారు. అప్పుడు దేవయాని సాక్షితో, చేతులు వరకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నావు పోన్లే అయిందా మొదటి నుంచి మళ్లీ రిషి దగ్గరికి వెళ్లి తనే నిన్ను పెళ్లి చేసుకొనేలా చేస్తాను. నువ్వేం బాధపడొద్దు సాక్షి అయినా ఉంగరంలో అక్షరం ఉన్నంత మాత్రాన ఏం జరిగిందని ఇప్పుడు. తెలిసో తెలియకో రాశాడు చూస్తూ చూస్తూ రిషిని వసుధారతో ఎలాగా వదిలేస్తాము. రిషి నీవాడు అనుకో ఏం పని చేసిన పర్లేదు నా వాడే కదా అని నీకు ఉండాలి.
 

ఇప్పుడు నుంచి మళ్లీ మొదలు పెడదాము అని అంటుంది దేవయాని. అప్పుడు సాక్షి మనసులో, నాకు దక్కని రిషి ఇంకెవరికి దక్కకుండా చేస్తాను. ఇలా జరగాలంటే దేవయాని ఆంటీ చెప్పినట్టు వినడమే మంచిది అని మనసులో అనుకొని ఇప్పుడేం చేద్దాము అని అడుగుతుంది. అప్పుడు దేవయాని దగ్గర్లో పెద్ద పరీక్షలు వస్తున్నాయి కనుక ఇద్దరు శ్రద్దగా పరీక్షల మీద దృష్టి పెడతారు. ఈ సమయంలో వాళ్ళ మధ్య చదువు తప్ప ఇంకేం సంబంధం ఉండదు. కనుక ఇదే సమయంలో మనం ఏదైనా చేయాలి అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో రిషి రెస్టారెంట్ దగ్గరికి వచ్చి వసుధార కోసం వెతుకుతాడు. అక్కడ వసుధార లేకపోగా అక్కడ ఉన్న మేనేజర్ ని పిలిచి వసుధార లేదు ఎందుకు అని అడగగ పర్మిషన్ తీసుకొని ఈరోజు వెళ్ళింది అని అంటాడు.
 

తను ఈ మధ్య ఏదైనా తేడాగా ఉందా? తన ఒంట్లో బాలేద అని రిషి అడగగా అడ్వాన్స్ గా  పదివేలు అడిగింది సార్. తను ఏం చేసినా డబ్బులు వృధా చేసే మనిషి కాదు కాబట్టి ఇచ్చాము అని అంటారు. అప్పుడు రిషి మనసులో డబ్బు అవసరమైతే నన్ను అడగాలి కదా. నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో వసు ఆ ఉంగరాన్ని తాడు తో కట్టి మెడలో పెట్టుకుంటుంది. అదే సమయంలో రిషి వసుధార ఇంటికి వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!