శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర కథ కూడా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే అంశంతోనే ఉంది. మాజీ ప్రేయసి, ప్రజెంట్ లవర్ మధ్య కన్ఫ్యూజన్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కమెడియన్ సత్య, సునీల్, సీనియర్ నటుడు నరేష్ మంచి కామెడీ పండిస్తున్నారు.