మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ప్రస్టీజియస్ `ఎన్టీఆర్ నేషనల్ అవార్డు`తో సత్కరించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవికి ప్రస్టీజియస్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని అందించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమాకి చేస్తున్న సేవలకుగానూ చిరంజీవికి `ఎన్టీఆర్ నేషనల్ అవార్డు`ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఉగాది పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో చిరంజీవితోపాటు, కమల్ హాసన్, నాగార్జున, అమల, మాధురీ దీక్షిత్, నాగచైతన్య, రష్మిక మందన్నా వంటి అవార్డు విన్నర్స్, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న సేవాలని ప్రశంసించారు.
24
ఎన్టీఆర్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి పోస్ట్
తాజాగా చిరంజీవి.. ఎన్టీఆర్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. `చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు. తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకు తీసుకొని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే.. N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా, ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న `ఎన్టీఆర్ నేషనల్ అవార్డు` నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను` అని తెలిపారు చిరంజీవి.
34
ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన మూవీ
ప్రస్తుతం చిరంజీవి పోస్ట్ వైరల్ అవుతుంది. అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఎన్టీఆర్, చిరంజీవి కలిసి ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ `తిరుగులేని మనిషి` అనే చిత్రంలో కలిసి నటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో కాగా, చిరంజీవి కీలక పాత్రలో నటించారు. 1981లో ఈ మూవీ విడుదలైంది. డీసెంట్గా ఆడింది. అయితే అప్పటికీ చిరుకి బ్రేక్ రాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లారు. చిరంజీవి ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ సినిమాల్లో తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు.
ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో సందడి చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేసిన ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. పాన్ ఇండియా చిత్రాలు కాకుండా, రీజినల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ `వాల్తేర్ వీరయ్య` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు చిరు.. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. `పారడైజ్` రిలీజ్ తర్వాత ఈ చిత్రం స్టార్ట్ కానుంది.