పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. 2022 ఆగష్టు 25న లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. లైగర్ చిత్రం పూరి జగన్నాధ్ తో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పీడకల లాగా మారింది. ఆ చిత్రం మిగిల్చిన నష్టాల నుంచి వారు ఇంకా తేరుకోలేదు. లైగర్ నష్టాల వ్యవహారం పూరి జగన్నాథ్, ఛార్మి లకు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.