అదే ఊర్లో ఓ టీచర్ సుహాసిని వస్తుంది. అందరు భయపడినా, ఆమె మాత్రం ధైర్యంగా ఉంటుంది. పులిరాజులోని మంచితనం చూస్తుంది. కసాయి రౌడీ అయినా, మార్చితే మారతాడు అని నమ్ముతుంది. పులిరాజుని మార్చేప్రయత్నం చేస్తుంది. టీచర్ మాటలకు పులిరాజులోనూ మార్పు వస్తుంది.
చూడ్డనికి కసాయి వాడుగా ఉన్నా, క్రమంలో ఆయనలోనూ మార్పు వస్తుంది. సుహాసిని పాత్ర పులిరాజు గురించి దేవుడికి మొక్కుకోవడంతో అది చాలు నాకు అంటూ సంతోషిస్తాడు పులిరాజు. ఆ తర్వాత అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.
వీరిద్దరు కలిశారా? విడిపోయారా? అనేది కథ. భారతీరాజా రూపొందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఇళయరాజా సంగీతం అందించారు. 1987లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. కానీ క్రిటిక్స్ ప్రశంసలందుకుంది.