అయితే వీరంతా 80బ్యాచ్కి చెందిన ఆర్టిస్ట్ లు. వారంతా ప్రతి ఏడాది కలుస్తుంటారు. పార్టీలు చేసుకుంటారు. ప్రతి ఏడాది ఒక స్టార్ ఆతిథ్యమిస్తుంటారు. ఇటీవల రెండు మూడు సార్లు చిరంజీవి ఇంట్లోనే ఈ పార్టీ జరగడం విశేషం. ఇందులో చిరంజీవి, వెంకటేష్, నరేష్, మోహన్లాల్, శరత్ కుమార్, ప్రభు, టైగర్ ష్రాఫ్, రమేష్ అరవింద్, భాను చందర్, నాగార్జున, సుమన్ అలాగే రమ్యకృష్ణ, జయసుధ, నదియ, రాధ, శోభన, ఖుష్బూ, సుహాసిని, సుమలత, రాధిక ఇలా అప్పట్లో స్టార్లుగా వెలిగిన వారంతా కనిపిస్తుంటారు. కానీ విజయశాంతి ఇందులో మిస్సింగ్.