కైకాల మరణం కలచివేస్తోంది.. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ సంతాపం

First Published Dec 23, 2022, 2:32 PM IST

కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది.  టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా కైకాలకునివాళి అర్పిస్తున్నారు. కొందరు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.. 

తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు సత్యనారాయణగారి మృతి తనను కలచి వేస్తోందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.  కైకాలకునివాళి అర్పిస్తూ.. ఆయన ట్విట్టర్ లో ఓ నోట్ రిలీజ్ చేశారు. అంతే కాదు స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకింత భావోద్వేగానికిలోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. కైకాల  ఆయన పోషించినటువంటి వైవిధ్యభరితమైన పాత్రలను భారతదేశంలో మరెవరూ పోషించి ఉండరని చెప్పారు. ఆయనతో కలిసి తాను ఎన్నో చిత్రాలలో నటించానని, ఆ సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు కలిగిందని అన్నారు.

 డైలాగ్ డెలివరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన పంథా అని చెప్పారు మెగాస్టార్ చిరంజివి. స్వచ్ఛమైన స్పటికంలాంటి వ్యక్తి అని, నిష్కల్మషమైన మనసున్న మనిషని కొనియాడారు. తనను తమ్ముడూ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారని చెప్పారు. తమ మధ్య ఆత్మీయతానుగారాలు అంతకంతకూ బలపడుతూ వచ్చాయని అన్నారు. ఆయనతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. 
 

నటనతో పాటు రుచికరమైన భోజనం అన్నా సత్యనారాయణగారికి చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. తన శ్రీమతి సురేఖ చేతి వంటలంటే ఎంతో ఇష్టపడేవారని చెప్పారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం తనకు మిగిలిన సంతృప్తి అని అన్నారు. ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా 'అమ్మా సురేఖా, ఉప్పుచేప వండి పంపించు' అని అన్నారని... మీరు త్వరగా కోలుకోండి, ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దామని తాము అన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంబరపడిపోయారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

ఇక మెగాస్టార్ వెళ్లిన సమయంలోనే పవర్ స్టార పవన్ కల్యాణ్ కూడా కైకాలకు నివాళి అర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. కైకాల మరణం బాధించిందన్నారు. చెన్నైలో ఉన్నటప్పటి నుంచి మా కుటుంబంతో ఆయన అతనుబంధం కొనసాగుతుందన్నారు. ఈమధ్యే కలిసి  ఆరోగ్యం గురించి అడిగానని. కాని ఇలా కైకాలను చూస్తాను అనుకోలేదంటూ పవన్ కల్యాణ్ అన్నారు. అంతే కాదు జనసేన తరపున సంతాప సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు పవర్ స్టరా్.  

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్  మహేశ్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా కైకాలకు నివాళి అర్పించారు. ఆయన మరణంపై  స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణగారి మృతి కలచివేస్తోందని మహేశ్ అన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. సత్యనారాయణగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. కైకాల చివరగా మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. మురారి సినిమాల్ వీరి కాంబినేషన్ కు మంచి పేరు వచ్చింది. 
 

click me!