చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు... అల్లు అరవింద్ వద్దంటున్నా వాళ్లకు బన్నీ వాసు స్ట్రాంగ్ వార్నింగ్!

First Published Mar 16, 2021, 9:31 AM IST

హెల్తీగా ఉన్న చిత్ర పరిశ్రమలో రాజకీయాలు చేసి వాతావరణం చెడగొట్టవద్దని నిర్మాత బన్నీ వాసు, చావుకబురు చల్లగా మూవీ వేదిక సాక్షిగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. నిర్మాత అల్లు అరవింద్ వారిస్తున్నా... వినకుండా వాళ్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు బన్నీ వాసు. 
 

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అధినేతగా ఉన్న బన్నీ వాసు యంగ్ హీరో కార్తికేయతో చావుకబురు చల్లగా అనే చిత్రం చేశారు. ఈ మూవీ మార్చ్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
undefined
ఈ సంధర్భంగా వేదికపై మాట్లాడిన బన్నీ వాసు... చావుకబురు చల్లగా మూవీపై కొందరు పిఆర్ఓ లు నెగిటివ్ పబ్లిసిటీ మొదలుపెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చావు కబురు చల్లగా కేవలం రెండు వారాలలో ఓటీటీ లో విడుదల అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నాడు.
undefined
ఓ చిత్ర నిర్మాతలు తమ పిఆర్ఓ లతో కావాలని ఇలా చేయిస్తున్నారని, వాళ్ళ పేర్లు చెవితే బాగోదని ఊరుకుంటున్నా అన్నారు. పాలిటిక్స్ లో మాదిరి పరిశ్రమలో కూడా రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నించాడు.
undefined
అల్లు అరవింద్ గారు ఎప్పుడూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారు.. చావు కబురు చల్లగా మీరు అనుకున్నట్లు ఆహాలో రెండు వారాలలో రాదు. అది సినిమా రేంజ్ పై ఆధారపడి ఉంటుంది. మేము ఎప్పుడూ సినిమా... థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయాలని కోరుకుంటాం అని బన్నీ వాసు అన్నారు.
undefined
హెల్తీగా ఉన్న పరిశ్రమలో ఇలాంటి రాజకీయాలతో అనారోగ్యకర వాతావరణం సృష్టించవద్దని కోరాడు. ప్రతి సినిమా ఆడాలి, రెవెన్యూ రావాలని కోరుకుంటానని, కొత్తగా పరిశ్రమలోకి వచ్చి ఇలాంటి రాజకీయాలు చెయ్యొద్దని గట్టిగా మాట్లాడారు.
undefined
సదరు పిఆర్ఓలు కూడా ఇలాంటి చెడ్డ పనులు, ఒక చిత్రంపై బ్యాడ్ ప్రోపగాండా ప్రచారం చేయడం ఆపుకోవాలి, మాతో వారికి భవిష్యత్ లో చాలా ప్రయాణం ఉంటుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
undefined
మధ్యలో అల్లు అరవింద్ కలుగజేసుకొని మైక్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా... వాసు వినిపించుకోలేదు. తాను చెప్పాల్సింది మొత్తం చెప్పేశాక అందరికీ ధన్యవాదాలు తెలిపి.. సెలవు అన్నారు.
undefined
ఇక బన్నీ వాసు వార్నింగ్ ఇచ్చింది జాతి రత్నాలు నిర్మాతలకు అని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా పిఆర్ఓలపైనే బన్నీ ఫైర్ అయ్యాడని పరిశ్రమలో అనుటుకుంటున్నారు.
undefined
అయితే దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.  టాలీవుడ్ లో బన్నీ వాసు సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఉన్నారు. ఆయన గత చిత్రం ప్రతిరోజూ పండగే రికార్డు వసూళ్లు సాధించింది. హీరో ధరమ్ ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు.
undefined
click me!