వేదవతిని పిలుస్తూ వీధిలోని ముగ్గురు నలుగురు మహిళలు వస్తారు. అందులో ఒకామె మాట్లాడుతూ ‘మా కోడలు నెల తప్పిందని తెలుసు కదా.. అందుకే మా ఊరి అమ్మవారి దగ్గర పూజ చేశాను. ఆ పసుపు కుంకుమలు నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను’ అని చెబుతుంది. అది విని వేదవతి చాలా బాధపడుతుంది. అక్కడే ఉన్న వల్లిని ఆ మహిళ పిలుస్తుంది. వల్లితో కొంగు పట్టమ్మా పసుపు కుంకుమ తీసుకుందువు అని అంటుంది. వల్లి కొంగు పట్టగానే ఆమె పసుపు కుంకుమ కొంగులో పెట్టబోతుంది. అయితే వేదవతి ఆమెను అడ్డుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి నర్మదను పిలుస్తుంది. కొంగు పట్టి అమ్మవారి పసుపు కుంకుమ తీసుకోమని నర్మదకు చెబుతుంది వేదవతి. అప్పుడు వచ్చిన మహిళలు ‘పెద్ద కోడల్ని కాదని రెండో కోడలిని తీసుకోమంటున్నారు ఏంటి’ అని అడుగుతారు.
అప్పుడు వేదవతి మాట్లాడుతూ ‘పెద్ద కోడలు అంటే పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోవడంలోనూ, వయసులోనూ కాదు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో, పెద్ద మనసు ఉండడంలో ఉంటుంది’ అంటుంది వేదవతి. నర్మద కొంగు పట్టి పసుపు కుంకుమను తీసుకుంటుంది. వేదవతి కుంకుమ తీసుకొని ఇద్దరు కోడళ్ళకు బొట్టు పెట్టి.. వల్లిని మాత్రం వదిలేస్తుంది. అది చూసి వల్లి చాలా బాధపడుతుంది. వేదవతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
వల్లి వేదవతి దగ్గరికి వచ్చి ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించండి అత్తయ్యా అని అడుగుతుంది. దానికి వేదవతి కాళ్ళను వదిలించుకుని ‘ మిగతా ఇద్దరు కోడళ్ళ కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చాను. నా కూతురికంటే ఎక్కువ ప్రేమను పెంచాను. కానీ నా ప్రేమ నీకు పిచ్చితనం అయింది, నా మంచితనం నీకు చేతకానితనమైంది. నీ మీద నాకు అసహ్యం వేస్తోంది. అది జన్మలో పోదు’ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్మదను, ప్రేమను వేదవతి ఆప్యాయంగా చూడడం చూసి వల్లిలో కోపం పెరుగుతుంది. మళ్లీ కుటుంబంపై పగబట్టేలా కనిపిస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది