ఆ బడ్జెట్ ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోలు స్వయంగా థియేటర్స్ కి వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, విజయోత్సవాలు ఇలా ప్రమోషన్స్ పెరిగిపోయాయి. ఇక సంధ్య థియేటర్ కేసులో ఏం జరిగిందంటే.. థియేటర్ యాజమాన్యం పోలీసులకు కేవలం లెటర్ మాత్రమే రాశారు. కానీ అల్లు అర్జున్ లాంటి మాస్ హీరో వస్తున్నప్పుడు యాజమాన్యం స్వయంగా థియేటర్ కి వచ్చి అనుమతి తీసుకోవాలి అని పోలీసులు చెబుతున్నారు.