2009లో వెండి తెరకు పరిచయమైంది. అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. హిందీతో పాటు తెలుగులోనూ నటించి పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నటిగా ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలోనే పలు వివాదాల్లోకి ఇరుక్కుంది. 39 ఏళ్ల వయసులోనే ఏకంగా ఓ ఐల్యాండ్ను కొనుగోలు చేసింది, కోట్లాది రూపాయలను ఆర్జించింది. చివరికి ఏకంగా రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచారణ సైతం ఎదుర్కొంది.