12 మందితో ఎఫైర్.. ఒకరితో పెళ్లి.. చివరకు ఒంటరిగా మిగిలిన బాలీవుడ్ హీరోయిన్....?

First Published Apr 24, 2024, 10:45 AM IST

ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది ఓ బాలీవుడ్ హీరోయిన్. ఒకప్పుడు స్టార్ గా వెలుగు వెలిగిన ఈ సీనియర్ బ్యూటీ.. దాదాపు 12 మందితో డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది. 
 

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే లవ్ లు.. ఎఫైర్లు, డేటింగ్ లు, బ్రేకప్ లు చాలా కామన్. అందులో బాలీవుడ్‌ లో అయితే అవి ఇంకా ఎక్కువ.  కొంత మంది సీక్రేట్ గా మెయింటేన్ చేస్తే.. ప్రస్తుత కాలంలో చాలామంది పబ్లిక్ గానే తమ రిలేషన్ ను కొనసాగిస్తున్నారు. ఇలా చాలా మంది వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పటి స్టార్స్ కాస్త ఫాస్ట్ కాబట్టి బయట పడుతున్నారు..కాని ఒకప్పుడు అంటే   90లలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన ఓ సీనియర్ తార 12 మందితో డేటింగ్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరంటే..?

మనీషా కోయిరాలా బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా  ఒక ఊపు ఊపేసిన తార. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. పెళ్ళికి ముందే  12 మందితో ప్రేమలో మునిగి తేలిందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఆమె చేసుకున్న ఏకైక పెళ్ళి కాస్త పెటాకులు కావడంతో...  భర్తతో కూడా విడాకులు తీసుకొని 53 ఏళ్ల వయస్సులో ఒంటరిగా గడుపుతోంది.

రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు.. 3000 కోట్ల ఆస్తికి ఆ హీరో వారసుడు.. ఎవరో తెలుసా..?

నేపాల్ లో 1970లో పుట్టి పెరిగిన మనీషా కోయిరాలా.. ఇండియాలో నటిగా తన జీవితాన్ని 1991లో  మొదలు పెట్టింది.  బాలీవుడ్ తో పాటు తన నట జీవితాన్ని ప్రారంభించింది. ప్రధానంగా బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. తమిళ ఇండస్ట్రీలో కూడా అడరుగుపెట్టింది. మనీషా కొయిరాలా 33 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటుంది మనీషా. 

అయితే మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పటికప్పుడు  వార్తల్లో  వైరల్ అవుతూ వస్తోంది. 14 ఏళ్ళ క్రితం.. అంటే 2010 లో  నీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెళ్ళి చేసుకున్నారు. కాని వారి వివాహజీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన రెండేళ్ళకే.. అంటే 2012 లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. 
 

ఇక మనీషా ఫిల్మ్ కెరీర్ లో ఆమె లవ్ స్టోరీలయితే.. చాలా ఉన్నాయంటారు. ఆమె డేటింగ్ లిస్ట్ లో సినిమా వాళ్లు మాత్రమే కాదు.. వ్యాపార దిగ్గజాలు, ఇతర సెలబ్రిటీలు కూడా ఉన్నారట. ఆమె సినిమాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నటుడు వివేక్ ముశ్రన్ తో ఎక్కువగా  కలిసి ఉండేవారు అని టాక్. 91 నుంచి వీరి బంధం మొదలయ్యింది. సౌదాగర్ సినిమాతో కలిసిన వారు.. కొంత కాలానికి విడిపోయినట్టు చెపుతారు. 

బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌తో కూడా 90స్ లో ఆమె  డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. 1996  అగ్నిసాక్షి సినిమాతో వీరి బంధ మొదలయ్యిందట. అంతే కాదు ఓ సందర్భంలో నానా పటేకర్ ఈ వార్తను  అంగీకరించారట కూడా. కొంత కాలానికే వీరి బంధం కూడా తెగిపోయింది. వివేక్ తో బ్రేకప్ అయినప్పుడు మనీషా డిప్రెషన్ లో ఉంటే.. నానా పటేకర్ ఆమెను ఓదార్చారని.. అలా వారి బంధం బలపడిందంటారు. 

కొంత కాలానికి మనీషా కోయిరాలా DJ హుస్సేన్‌తో ప్రేమలో పడింది. వీరు కూడా చాలా కాల డేటింగ్ చేశారట. కాని అంతలోనే  నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ మనీషా జీవితంలోకి వచ్చాడు. వీరి బంధం బలపడటంతో.. హుస్సేన్ తో  విడిపోయారు మనీషా. అయితే సెంథిల్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు చాలా కాలం వరకూ తెలియదు. కాని ఒక్క సారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరి విషయం బయటకు వచ్చింది. 
 

 సెసిల్ ఆంథోనీతో బ్రేకప్ ముగిసిన తర్వాత..మనీషా కోయిరాలా.. నటుడు ఆర్యన్ వైద్‌ డేటింగ్ చేసింది. ఆ తర్వాత.. నేపాల్‌లోని ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్‌తో మనీషా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీళ్లే కాదు..మనీషా కోయిరాలా డేటింగ్ చేసిన వాళ్లలో.. వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, మోడల్ రాజీవ్ మూల్‌చందానీ, సంగీత స్వరకర్త సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. 

ఈ విషయాలు ఎవరు  పబ్లిక్ గా ఒప్పకోరు. అలా అని అందులో అన్నీ నిజాలే ఉన్నాయని చెప్పలేము. కాని నిప్పులేనిదే పొగరాదుకదా. అలానే ఈ డేటింగ్ విషయంలో కూడా పబ్లిక్ టాక్.. సోషల్ మీడియాలో ఫోటోలు.. కొన్ని వారే ఒప్పుకున్న నిజాలు.. అన్నీ కలిపి సంచలనంగా మారాయి. ప్రస్తుతం మనీషా కోయిరాలా ఓంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నారు. 

click me!