బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ముగిసింది. 14 మంది రెగ్యులర్, 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాల్గొన్న లేటెస్ట్ సీజన్ కి గాను అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్ ఫైనల్ కి వెళ్లారు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచిన కారణంగా నేరుగా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.
టైటిల్ పోరు నిఖిల్-గౌతమ్ మధ్యనే అంటూ గత నాలుగు వారాలుగా ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో అవినాష్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అవుతారని ముందే ప్రేక్షకులు ఊహించారు. అవినాష్ కి 5వ స్థానం దక్కింది. 4వ స్థానంలో ప్రేరణ, 3వ స్థానంలో నబీల్ నిలిచారు. ఇక నిఖిల్, గౌతమ్ లలో టైటిల్ ఎవరిదే ఉత్కంఠ నెలకొంది.