నబిల్ - గౌతమ్ మధ్య రాజుకుంటున్న మంట.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్ ఇదే..?

First Published Oct 8, 2024, 11:29 PM IST

బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 8 లో అసలైన ఆట స్టార్ట్ అయ్యింది. కొత్తగా వచ్చిన పాత కంటెస్టెంట్ల చేతిలో.. ప్రస్తుతం సీజన్ సభ్యులు నలిగిపోతున్నారు.  
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ ప్లాన్ మామూలుగా లేదు. ఈసీజన్ ను అన్ని లిమిట్ లెస్ అని చెప్పినట్టుగానే.. పక్కా ప్రాణాళికతో వెళ్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పంపించి బిగ్ బాస్.. వచ్చీ రావడంతో ఇప్పటి వరకూ ఉన్న హౌస్ మెట్స్ పై నామినేషన్ల బాంబులు వేయిస్తున్నారు. దొరికింతే ఛాన్స్ గా కొత్తగా వచ్చిన మెగా క్లాన్ సభ్యులు.. ఇంట్లో ఉన్నవారిని చీల్చి చండాడుతున్నారు. 

ఒక్కొక్కరి తప్పును వెతికి బయటకు తీసి మరీ నామినేషన్లు చేస్తూ.. ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఈక్రమంలోన ఎక్కువ నామినేషన్లు యష్మికి పడ్డాయి. వచ్చినవారంతే యష్మిని టార్గెట్  చేసినట్టు తెలుస్తోంది. మణింకఠ విషయంలో యష్మి ఎలా టార్గెట్ చేసిందో.. అంతకు రెట్టింపు టార్గెట్ అయ్యింది యష్మి. 

Bigg boss telugu 8

మణికంఠ ఒక్కడి విషయంలోనే కాదు.. ఇతర విషయాల్లో కూడా పాయింట్ టు పాయింట్ తీస్తూ.. యష్మిని చీల్చి చండాడారు. ఇక యష్మి తరువాత గట్టిగా టార్గెట్ అయిన మరో కంటెస్టెంట్ విష్ణు ప్రియ. నీ ఆట నువ్వు ఆడటంలేదు.. ఎంతసేపు ఒకరిమీదనే దృష్టిపెట్టి.. ఏం చేద్దామనుకుంటున్నావు అంటూ కడిగిపడేశారు కొత్త క్లాన్ సభ్యులు. ఇక సీత, పృధ్వీ కూడా నామినేషన్స్ లో టార్గెట్ అయ్యారు. 

ఇక ఈ విషయంలో కూడా ఓజీ క్లాన్ సభ్యులు అంతా ఒక్కటై..మణికంఠను దూరంపెడుతున్నారు ఈవారం మణింకఠను నామినేట్ చేయవద్దు అంటూ డిసైడ్ అయ్యారు. పృధ్వీ ఒక అడుగు ముందుకు వేసి.. మణికంటలో మార్పు గమనించారా.. అతను మనం చెపితే వినడంలేదు కాని.. అవతల క్లాన్ నుంచి గౌతమ్ చెప్పగానేవింటున్నాడు. అని అబాండం వేశాడు. 

Latest Videos


Bigg boss telugu 8

సో అది అబాండమా.. లేక నిజమా అనేది వీకెండ్ లో నాగార్జున తేల్చేస్తాడు అని అనుకుంటున్నారు అంతా. అయితే ఈవీకెండ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదరుచూడాల్సిన పరిస్థితి. ఎందుకుంటే దసరా ఈవెంట్ తో పాటు.. నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతాడు.. ఎవరు ఇంట్లోంచి బయటు వెళ్ళిపోతారు అనేది తెలియాల్సి ఉంది. దాదాపు ఇంట్లోనుంచి యష్మినే బయటకు వెళ్ళిపోతుందేమోనని అందరి అభిప్రాయం. 

మణికంఠ విషయంలో నామినేషన్లు పడటంతో.. అతనిపై ఇంకా కోపం పెంచుకుంటున్నారే తప్ప.. ఇంత మంది ఎందుకు అంటున్నారు. బయట నుంచి గేమ్ చూసి వచ్చారు కదా..మనల్నిమనం ఏం మార్చుకోవాలి అని ఎవరు అనుకోవడంలేదు. అదే యష్మి లాంటివారికి మైనస్ గా మారింది. ఇక ఇంట్లో వాళ్లకు రేషన్ కాన్సిల్ చేసి.. బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. 

Bigg boss telugu 8

ఇక ఇంట్లోకి రేషన్ కావాలి అంటే.. ఇచ్చిన టైమ్ లోనే పోటీపడి రేషన్ తెచ్చుకోవాల్సి ఉంది. ఇక నబిల్, నిఖిల్ కలిసి రేషన్ కోసం హౌస్ లోకి వెళ్ళారు. వాళ్ళు తీసుకురాగలిగినంత రేషన్ తీసుకువచ్చారు. కాని అసలైన సాల్ట్ మిస్ చేశారు. దాంతో బిగ్ బాస్ ను అందరు బ్రతిమిలాడుకోవడం స్టార్ట్ చేశారు. సాల్ట్ కావాలని అడగడంతో బిగ్ బాస్ బేరాలు మొదలు పెట్టారు. 

సాల్ట్ కావాలంటే ప్రైజ్ మని  నుంచి 50 వేలు కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు.  దాంతో ఒక్క ప్యాకెట్ ఉప్పుకోసం 50 వేలు పెట్టాల్సిన పరిస్థితి. అది కూడా నెక్ట్స్ టైమ్ వరకూ సరిపోతుందా లేదా అనేది తెలియదు.  ఇక హౌస్ లో ఎవరికి వారు తమ పాయింట్స్ ను రెడీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ముందుగా అనుకున్నదే జరుగుతుంది. 

Bigg boss telugu 8

నబిల్, గౌతమ్ మధ్య పోరు తప్పదన్నట్టు తెలుస్తోంది. ఎందుకుంటే ప్రతీ విషయంలో నబీల్ చేయాల్సిన పనులు కూడా గౌతమ్ కల్పించుకుని చేయడంతో పాటు.. నబిల్ చేతిలో పేపర్ ను లాక్కుని మరీ చేస్తున్నాడు.దాంతో నబిల్ ఈ విషయంలో కోపంగా ఉన్నాడు. ఇక మెహబూబ్ ను నామినేట్ చేయడం వల్ల అతను కూడా కోపంగానే ఉన్నాడు. సో ఈసారి హౌస్ లో ఉన్న కుస్తీ ఫైటర్స్ నలుగురిమధ్య ఎలాంటి టఫ్ ఫైట్ జరుగుతుందో కచూడాలి. 

click me!