ఎవరిదైనా ఆకలే కదా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ..ఈసారి హౌస్ లో యాష్మి Vs నిఖిల్

First Published Sep 18, 2024, 10:57 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా డే 18 కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

ప్రోమో చూస్తుంటే ఈసారి యాష్మి.. నిఖిల్ పై విరుచుకుపడ్డట్లు అర్థం అవుతోంది. టాస్క్ విషయంలో నిఖిల్, యాష్మి మధ్య గొడవ చెలరేగింది. సంచాలక్ నిఖిల్ కి ఫేవర్ చేస్తున్నాడని యాష్మి వాదిస్తోంది. గట్టిగా కేకలు పెట్టింది. దీనితో నిఖిల్ కూడా అరవద్దు అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Videos


అభయ్, ప్రేరణ, పృథ్వీరాజ్ గేమ్ లో వారి స్ట్రేటజీ ల గురించి చర్చించుకుంటున్నారు. ప్రేరణ విషయంలో విష్ణుప్రియ బాగా హర్ట్ అయింది. ఆమె తన ఫుడ్ వడ్డించిన విధానం నచ్చలేదని విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తుండడంతో ఇతరులు ఓదార్చే ప్రయత్నం చేశారు. 

Also Read: తాతగారు తప్పు చెప్పరు..జూనియర్ ఎన్టీఆర్ లాజిక్ విని స్టార్ హీరోకి మైండ్ బ్లాక్, ఏం జరిగిందంటే

ఏదో ఇష్టం లేకుండా తన ముఖాన విసిరికొట్టినట్లు ఫుడ్ వడ్డించింది అని విష్ణుప్రియ కంటతడి పెట్టుకుంది. ఎవరిదైనా ఆకలే కదా అంటూ భావోద్వేగానికి గురైంది. మరి కంప్లీట్ ఎపిసోడ్ లో విష్ణుప్రియ హర్ట్ కావడానికి.. యాష్మి నిఖిల్ పై కోపంతో ఊగిపోవడానికి కారణాలు తెలియనున్నాయి. 

Also Read : చిరంజీవితో రొమాన్స్, పెళ్లయ్యాక నా సినిమాలు నువ్వు చూడకూడదు..భర్తకి హీరోయిన్ కండిషన్

click me!