ఆ తర్వాత ప్రజలు అయిన ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి, గౌరవ్ తిరుగుబాటు మొదలు పెట్టారు. తమపై కమాండర్లు అధికారం చలాయించకూడదు అని, రాజులు తినే భోజనమే తమకు అందాలని డిమాండ్ చేశారు. దీనితో రాజులు కళ్యాణ్, నిఖిల్, రీతూ వారితో చర్చించి, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలన్నీ చాలా సరదాగా సాగాయి. ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి.. రాజుల మాటలు వినకుండా వారికి చుక్కలు చూపించారు.