బుల్లితెరపై తన అందం, అభినయంతో కట్టిపడేసింది తనూజ. ముద్ద మందారం సీరియల్ తర్వాత మరో సీరియల్ చేయలేదు. చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే తిరిగి టీవీ అడియన్స్ ముందుకు వస్తుంది. తనూజ కర్ణాటకకు చెందిన అమ్మాయి.. కానీ ఒక్క సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది. ఈ సీరియల్ మాత్రమే కాకుండా పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా కూడా ఆమె నటించింది. కానీ ఈ అమ్మడుకు సినిమాలతో అంతగా గుర్తింపు రాలేదు. ఎక్కువగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ముద్ద మందారం తర్వాత నాగ భైరవి సీరియల్ చేసిన ఆమె.. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ లో నటించింది. ఇక తాజాగా బిగ్బాస్ సీజన్ 9లో ఈ అమ్మడు అడుగు పెట్టింది.