ఎక్కడో విదేశాల్లో ఉన్న తన భార్య పంపించిన మెసేజ్, ఫుడ్ మణికంఠకు అందకుండా... నిఖిల్ కు సబంధించిన ఫుడ్ ను తీసుకువచ్చింది యష్మి. దాంతో మణికంఠ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆతరువాత తనకు వచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకుని.. యష్మికి వచ్చిన ఫుడ్ కాకుండా.. ఫృధ్వీ కోసం ఫుడ్ ను తీసుకువచ్చాడు మణి.
ఇక ఈక్రమంలో .. ఎవరికి అయితే ఫుడ్ రాలేదో వారి బాక్స్ లు హౌస్ బయట పెట్టి.. ఫుడ్ వచ్చినవారికి ఫుడ్ రానివారికోసం ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. కాని అప్పుడు కూడా కనీసం మణికంఠను పరిగణలోకి తీసుకోకుండా.. విష్ణు ప్రియ ఫుడ్ ను సెలక్ట్ చేసుకున్నారు.
దాంతో క్లియర్ గా అర్ధం అవుతుంది. మణికంఠను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని. ఈక్రమంలో అతనికి ఓటింట్ పెంచడంతో పాటు.. ఈ వీక్ అతనిపై చేసిన కామెంట్స్ వలన అతన్నీ టైటిల్ రేస్ లో నిలబడేలా చేస్తున్నారు. ఇక టాప్ 5 లో మణికంఠ ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.