రెండో వారంలో నామినేషన్లో రోహిత్, త్రిగుణ్, ముఖేష్ గౌడ, రాం ప్రసాద్, దేబ్జానీ, షాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్, కృష్షుడు, వర్షిణి ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మొదటి నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే విషయంలో ఓ క్లారిటీ వస్తోంది. ప్రధానంగా ముగ్గురి మధ్యనే ఈ పోటీ కనిపించింది. ఓటింగ్లో లీస్ట్ లో కృష్ణుడు, సుధీర్, వర్షిణి ఉన్నారు. కానీ చివర్లో వర్షిణి పుంజుకుంది. ఆ తర్వాత సృష్టి లీస్ట్ లోకి వచ్చింది. దీంతో కృష్ణుడు, సుధీర్, సృష్టిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అన్నారు.