తెలుగు బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 7 సంచలనంగా నిలిచింది. ఊహించని విధంగా సామాన్య రైతు బిడ్డ విజేతగా నిలవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అరెస్ట్ కావడం లాంటి సంఘటనలు సీజన్ 7 లోనే జరిగాయి. విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, నటుడు శివాజీ, బుల్లితెర నటుడు అమర్ దీప్, శోభా శెట్టి లాంటి వారు ఈ సీజన్ లో హైలైట్ అయ్యారు.