శివాజీకి పల్లవి ప్రశాంత్ విలువైన బహుమతి... ఏమిచ్చాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్, ఇది కదా అసలైన గురుదక్షిణ!

First Published Mar 19, 2024, 5:29 PM IST

తన గురువు శివాజీకి పల్లవి ప్రశాంత్ విలువైన గిఫ్ట్ ఇచ్చాడు. అది చూసిన శివాజీ మురిసిపోయాడు. ఆ గిఫ్ట్ ఏమిటో తెలిశాక మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఎందుకంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది... 
 

Pallavi Prashanth


బిగ్ బాస్ హౌస్ వేదికగా ప్రతి సీజన్ కి కొన్ని బంధాలు, అనుబంధాలు ఏర్పడతాయి  సీజన్ 7లో స్పై బ్యాచ్ ప్రత్యేకంగా నిలిచారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ల స్నేహం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక, శోభ శెట్టిలకు పోటీగా శివాజీ తన టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

Pallavi Prashanth - Sivaji


పల్లెటూరు నేపథ్యం నుండి వచ్చిన పల్లవి ప్రశాంత్ కి, భాష రాని యావర్ కి శివాజీ సపోర్ట్ గా నిలిచాడు. అదే సమయంలో శివాజీకి గాయమైనప్పుడు వీరిద్దరూ అండగా ఉన్నారు. ఒక జట్టుగా వీరు గేమ్ ఆడారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంతో శివాజీ పాత్ర ఉంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

Pallavi Prashanth - Sivaji

శివాజీ మొదటి నుండి టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం పొందాడు. చివరి వారాల్లో పల్లవి ప్రశాంత్ బాగా పుంజుకున్నాడు. ఏకంగా టైటిల్ సొంతం చేసుకున్నాడు. కాగా తన గెలుపుకు కారణమైన శివాజీకి పల్లవి ప్రశాంత్ ఒక విలువైన బహుమతి ఇచ్చాడు. అది ఏమిటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. 

Pallavi Prashanth - Sivaji

పల్లవి ప్రశాంత్ గురుదక్షిణగా శివాజీకి కాఫీ పౌడర్ ఇచ్చాడు. ఇది విలువైన బహుమతా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. బిగ్ బాస్ ఆడియన్స్ కి శివాజీకి కాఫీ ఎంత విలువైనదో బాగా తెలుసు. హౌస్లో శివాజీ కాఫీ కోసం నానా రచ్చ చేశాడు. కాఫీ పౌడర్ పంపితేనే హౌస్లో ఉంటా లేదంటే వెళ్ళిపోతానని ఫైర్ అయ్యాడు. 
 

Pallavi Prashanth - Sivaji

శివాజీ అసలు కాంప్రమైజ్ కాలేదు. కాఫీ పంపాల్సిందే అని పట్టుబట్టాడు. శివాజీ దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్ కాఫీ పౌడర్ పంపాడు. శివాజీకి కాఫీ ఎంతో ప్రియమైనది కావున, పల్లవి ప్రశాంత్ అది గిఫ్ట్ గా ఇచ్చాడు. ఖరీదు పరంగా అది చాలా తక్కువే అయినా శివాజీకి ఇష్టమైనది కావడంతో విలువైన బహుమతి అనాల్సి వచ్చింది.

Pallavi Prashanth


మరోవైపు పల్లవి ప్రశాంత్ హామీ ఇచ్చిన ప్రకారం పేద రైతులకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ పంచుతున్నారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు లక్ష రూపాయలు, ఇక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో శివాజీ, భోలే షావలి, ఆట సందీప్ సైతం పాల్గొన్నారు. సందీప్ తన వంతు సాయంగా రూ. 25 వేలు ఇచ్చాడు. 

click me!