సాంబార్ తో చంపేస్తోన్న బిగ్ బాస్, ఒక్క గుడ్డు కోసం సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు, సంజన పైనే అందరి ఫోకస్

Published : Sep 10, 2025, 11:17 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి రోజు నుంచి నాగార్జున చెప్పినట్టుగానే రణరంగంలా మారింది. ఇప్పటికే నామినేషన్లు రచ్చ కొనసాగుతుండగా, తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మూడోవ రోజు విచిత్ర పరిస్థితి నెలకొంది. 

PREV
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చిత్ర విచిత్రంగా జరుగుతోంది. సెలబ్రిటీ, సామాన్యుల మధ్య స్నేహాలు, గొడవలు ఎమోషన్స్, నవ్వులు.. ఇలా ఉగాది పచ్చడిలా తయారయ్యింది బిగ్ బాస్ హౌస్. మరీ ముఖ్యంగా సామాన్యులను సెలబ్రిటీలను చేసిన బిగ్ బాస్, సెలబ్రిటీలకు ఫుడ్ లేకుండా చేశారు. రోజు, సాంబార్, ఆలు కర్రీ పంపిస్తూ.. అదే తినాలని రూల్ పెట్టడంతో, సాంబార్ తినలేక సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకు ఇచ్చిన ఫుడ్ తినడానికి రూల్ లేకపోవడంతో సంజన ఒక్క టీ కోసం అల్లాడిపోతోంది. రోజుకు 6 టీలు తాగుతాను నేను, ఒక్క టీ అయిన ఇవ్వండి అని సామాన్యులను సంజన బ్రతిమలాడుతోంది. కాని ఈ విషయంలో సామాన్యులు ఏమాత్రం కరగడంలేదు.

25

ఈక్రమంలోసంజన వల్ల హౌస్ లో రచ్చ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ పంపిస్తున్న ఫుడ్ సరిపోకపోవడంతో సంజన ఓ గుడ్డు దొంగతనంగా తినేసింది. ఈ విషయంలో హౌస్ అంతా రచ్చ రచ్చ జరిగింది. ఈ విషయంలో సెలబ్రెటీ కంటెస్టెంట్ భరణి - మాస్క్ మ్యాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే సంజన కారణంగా ఈ గొడవ జరిగింది. సంజన ఓనర్స్ అయిన కామనర్స్ పర్మిషన్ లేకుండా ఒక గుడ్డు దొంగతనం చేసింది. ఇది గుర్తించిన కామనర్స్ గుడ్డు ఎవరు దొంగతనం చేశారు అంటూ అందరినీ అడిగారు. కానీ, సెలబ్రెటీ కంటెస్టెంట్స్ ఎవరూ కూడా గుడ్డు ఎవరు తీశారో చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన ఇంటి ఓనర్స్ ఇకపై టెనెంట్స్ కి హౌజ్ లోకి పర్మిషన్ లేదని చెప్పారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. గుడ్డు దొంగతనం చేసింది సంజన అని తెలుసుకున్న భరణి ఆమెతో వాదించడం మొదలు పెట్టాడు. మీ ఒక్కరి కారణంగా మిగతా కంటెస్టెంట్స్ అందరికీ ఇంట్లోకి వెళ్లే పర్మిషన్ లేకుండా పోతుంది అని ఫైర్ అయ్యాడు.

35

ఇంతలో భరణి ఆర్గుమెంట్ లోకి మాస్క్ మ్యాన్ వచ్చి దూరాడు. దీంతో మాస్క్ మ్యాన్ వర్సెస్ భరణి గా గొడవ చెలరేగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. హౌజ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కూల్ గా కనిపించిన భరణి ఈరోజు విశ్వరూపం చూపించారు. ఆతరువాత వాళ్లు కలిసిపోయారు. కాని గుడ్డు గొడవ మాత్రం పెద్దది అయ్యింది. అయితే సంజనకు 5 నెలల పాప ఉండటంతో ప్రోటీన్ కోసం ఆమెతినాల్సి వచ్చిందన్న చర్చ జరిగింది. దాంతో నా పర్సనల్ విషయాలు తీసుకురావద్దు అంటూ సంజన ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది.

45

ఇక మరో వైపు సామాన్యులు అంతా కలిసి ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం సెలబ్రిటీలలో వచ్చింది. కాని సామాన్యులు మధ్య కూడా ఏదో ఒక గోడవ జరుగుతూనే ఉంది. రాము రాథోడ్ ఇన్నోసెంట్ ఫేస్ తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడని మనీష్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఒక వైపు పవన్ కళ్యాణ్ తో రీతువర్మ పులిహోర కలుపుతూనే ఉంది. ఇంకో వైపు ఇమ్మాన్యూయోల్ తన హడావిడి తాను చేస్తున్నాడు. ఇక హరీష్ ఇచ్చిన షాక్ తో తనూజ ఏడుస్తూనే ఉంది. ఎవరు ఆపినా ఆమె కంట్రోల్ అవ్వడంలేదు.

55

ఈక్రమంలో రీతూవర్మ కారణం లేకుండా అందరి మీద అరవడం ఆడియన్స్ కు కూడా షాకింగ్ గా అనిపించింది. గుడ్డు వివాదంలో ఆమె భరణీతో వాదించింది. సంజనాను ఎందుకు సేవ్ చేస్తున్నావు అంటూ భరణీపై అరిచింది. ఇక ఇంత జరుగుతున్నా.. సుమన్ శెట్టి మాత్రం కామ్ గా అంతా గమనిస్తూ ఏం మాట్లాడకుండా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ ను అనుకున్నట్టుగానే రణరంగం చేశారు, సామాన్యుల మధ్య కూడా చిచ్చు రేగింది. నెక్ట్స్ ఎసిసోడ్ లో వారి మధ్య పెద్ద పెద్ద గోడవలు అయినట్టు తెలుస్తోంది. మరి చూడాలి. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇలా ఉంటే, టాస్క్ లలో ఇంకెంత హడావిడి జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories