బాలకృష్ణకు అనారోగ్యం? ఆందోళనలో అభిమానులు, అసలేమయ్యింది?

Published : Sep 10, 2025, 09:19 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు వెల్లడించారు. ఇంతకీ ఆయనకు ఏమయ్యింది.? ఈ వార్తల్లో నిజం ఎంత?

PREV
14

నట సింహం, టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తాజాగా 2025 సెప్టెంబర్ 10న అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన 'సూపర్ సిక్స్' సభలో పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ, ‘‘ఈ సభకు బాలయ్యగారు, నారా లోకేష్ రావాల్సింది. అయితే బాలకృష్ణ కాస్త అనారోగ్యంతో ఉన్న కారణంగా సభకు రాలేకపోయారు,’’ అని ప్రకటించారు.

24

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ‘‘బాలయ్యకు ఏమైంది?’’, ‘‘ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?’’, ‘‘ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు బాలకృష్ణ ఆరోగ్యంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

34

ఇక మరోవైపు, నారా లోకేష్ సభకు హాజరుకాకపోవడానికి కూడా గల కారణాన్ని పయ్యవుల వెల్లడించారు. నేపాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారిని రక్షించేందుకు లోకేష్ యత్నిస్తున్నారని తెలిపారు. ‘‘లోకేష్ ప్రస్తుతం సచివాలయం నుండి నేపాల్ పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. అందుకే ఆయన సభకు రావడం సాధ్యపడలేదు,’’ అని వివరించారు.

44

ఇప్పుడు బాలకృష్ణ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ, సినీ రంగంలో స్టార్ గా వెలుగొందుతోన్న బాలయ్య, హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హీరోగా వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేశారు బాలయ్య బాబు. మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న బాయల్య స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలుసి ఫ్యాన్స్ ఆందోళణ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బాలయ్య ఆరోగ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories