జానీ మాస్టర్‌కి మరో బిగ్‌ షాక్‌, నేషనల్‌ అవార్డు రద్దు, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

First Published Oct 5, 2024, 11:37 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫ్‌ జానీ మాస్టర్‌కి కేంద్ర ప్రభుత్వం మరో బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆయనకు జాతీయ అవార్డుని రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Jani Master

జానీ మాస్టర్‌కి కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆయనకు జాతీయ అవార్డుని రద్దు చేసింది. ఇటీవల ఆయనపై తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ని వేధించాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖమంత్రిత్వ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనకు జాతీయ అవార్డుని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జానీ మాస్టర్‌ కి మరో పెద్ద షాక్‌ తగిలినట్టయింది. 

2022 ఏడాదికిగానూ జాతీయ అవార్డులను ఆగస్ట్ నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. `తిరుచిత్రంబలం` మూవీకిగానూ జానీ మాస్టర్‌కి, అలాగే సతీష్‌ మాస్టర్‌లకు కలిపి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డు ఫంక్షన్‌ ఈ నెల 8న ఢిల్లీలో జరగబోతుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ అవార్డుని అందుకోనున్నారు విజేతలు.

దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. పోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది. ఇది చాలా సీరియస్‌ కేసుగా ప్రభుత్వం, కోర్ట్ భావిస్తుంది. ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు జాతీయ అవార్డు ప్రదానం చేయడం సరైనది కాదని ప్రభుత్వం భావించింది. అందుకే జాతీయ అవార్డుని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

Latest Videos


Jani Master

ఈ మేరకు ఈ నెల 8న అవార్డు సెర్మనీలో పాల్గొని పురస్కారాన్ని అందుకోవాలని ప్రభుత్వం నుంచి జానీ మాస్టర్‌కి ఇన్విటేషన్‌ వెళ్లిన నేపథ్యంలో తాజాగా దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఇది జానీ మాస్టర్ కి మరో పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. జానీ మాస్టర్‌ జాతీయ అవార్డు ని అందుకునేందుకు బెయిల్‌కి అప్లై చేయగా, కోర్ట్ అనుమతిచ్చింది.

నాలుగు రోజులు ఆయనకు రిలీఫ్‌నిచ్చింది. రేపు అంటే ఆదివారం ఆయన జైలు నుంచి బెయిల్‌పై బయటకు రానున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం జాతీయ అవార్డుని రద్దు చేస్తున్నట్టు నోట్‌ని రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే తన వద్ద పని చేసే లేడీ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ని చాలా కాలంగా వేధిస్తున్నట్టు ఆ అమ్మాయి నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై కంప్లెయింట్‌ చేసింది. తాను మైనర్‌గా ఉన్నప్పట్నుంచే లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో దీన్ని పోక్సో చట్టం కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదుచేశారు.

ఈ కేసులోనే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. గోవాకి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని కోర్ట్ లో సబ్మిట్‌ చేశారు. కొన్ని రోజుల విచారణ అనంతరం జైలుకి పంపించారు. అయితే జాతీయ అవార్డులు తీసుకోవడం కోసం కోర్ట్ బెయిల్‌ మంజూర్‌ చేయగా, ఇప్పుడు ఏకంగా కేంద్రం అవార్డునే రద్దు చేయడంతో బెయిల్‌ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. 
 

click me!