బాలయ్య-అక్కినేని వివాదంలోకి చిరంజీవిని లాగిన బండ్లగణేష్‌.. పెంట చేశాడుగా.. ఆడుకుంటున్న నెటిజన్లు..

First Published Jan 24, 2023, 6:22 PM IST

బాలకృష్ణ, అక్కినేని వివాదంలోకి మెగాస్టార్‌ చిరంజీవిని లాగారు బండ్ల గణేష్‌. దీంతో ఇది సరికొత్త వివాదానికి దారి తీసింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడిది దుమారం రేపుతుంది. 
 

ఓ వైపు బాలకృష్ణ, అక్కినేని ఫ్యామిలీ మధ్య వివాదం నడుస్తుంది. అక్కినేనిని కించపరిచి మాట్లాడిన బాలయ్యకి అదిరిపోయే కౌంటర్లిచ్చారు నాగచైతన్య, అఖిల్. ఇప్పుడు బండ్ల గణేష్‌ పెట్టిన పోస్ట్ సరికొత్త వివాదానికి తెరలేపుతుంది. చిరంజీవిని ఇందులోకి లాగడమే ఇప్పుడు మరో చర్చకి దారితీస్తుంది. సోషల్‌ మీడియాలో హట్‌ టాపిక్‌ అవుతుంది.
 

 `వీరసింహారెడ్డి` సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ తన స్పీచ్‌లో ఏఎన్నార్‌ని కించపరిచేలా మాట్లాడారు. `ఆ రంగారావు, ఆ అక్కినేని తొక్కినేని` అంటూ నోటి దురుసు చూపించారు. దీంతో ఆయన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి. సోషల్‌ మీడియాలో మాత్రం దుమారం రేపుతున్నాయి. 
 

బాలయ్య కామెంట్లకి అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. `నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు,  ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం` అంటూ ట్వీట్‌ చేశారు. బాలయ్య పేరు ఎత్తకుండానే ఆయనకు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా పోస్ట్ పెట్టారు. దీంతో ఇప్పుడిది వైరల్‌గా, ట్రెండింగ్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. అటు ఫిల్మ్ నగర్‌లోనూ ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. అంతేకాదు నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య వార్‌లా మారిపోయింది. 

ఈ నేపథ్యంలో దీన్ని మరింత గెలికి పెద్దది చేస్తున్నారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి, చర్చకి దారితీస్తుంది. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దారుణంగా ఆడుకుంటున్నారు. బండ్లన్న పెంట చేశావ్‌గా అంటున్నారు. ఇంతకి బండ్ల గణేష్‌ ఏం పోస్ట్ పెట్టాడంటే, అక్కినేని హీరోలు పెట్టిన ట్వీట్‌ని పోస్ట్ చేస్తూ అందులో `ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ అండ్‌ చిరంజీవి సర్‌లను మేం రెస్పెక్ట్ చేస్తాం` అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్‌. 

ఇదే ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీస్తుంది. ముగ్గురు లెజెండ్‌లతోపాటు చిరంజీవి పేరుని కూడా కలపడమే ఈ వివాదానికి కారణమైంది. దీన్ని ఆసరగా తీసుకుని ఇతర హీరోల అభిమానులు, కామన్‌ నెటిజన్లు బండ్ల గణేష్‌కి షాకిస్తున్నారు. ఈ వివాదంలోకి చిరంజీవిని ఎందుకు లాగారని ప్రశ్నిస్తున్నారు. మధ్యలో చిరంజీవి ఏం చేశాడని, ఆయన పేరెందుకు తెచ్చారని, చిరుని ఎందుకు ఇరికించావ్‌ అని అంటున్నారు. అంతేకాదు బాలయ్యకి అంత సీన్‌ లేదా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 
 

అంతటితో ఆగడం లేదు, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌, చిరంజీవి లెజెండ్స్ అయితే, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, అల్లు రామలింగయ్యలకు రెస్పెక్ట్ ఇవ్వరా? కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులకంటే చిరంజీవి తోపా? అంటూ ఆడుకుంటున్నారు. బండ్ల గణేష్‌ని ట్రోల్స్ తో రచ్చ చేస్తూ, సరికొత్త వివాదానికి తెరలేపుతున్నారు. మరికొందరు మెగా హీరోలందరిని మిస్‌ అయ్యావంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తంగా బండ్ల గణేష్‌ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. బాలయ్య, అక్కినేని వివాదం కాస్త చిరు రంగు పులుముకుని మరో రూపం దాల్చుకుంటుంది. మరి దీనిపై బండ్ల గణేష్‌ స్పందించి వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెడతారా? మరింత పెద్దది చేస్తాడా? అనేది చూడాలి. 

Bigg Boss Telugu 6

మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారు. `మెంటల్‌ బాలకృష్ణ` అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. `ఏఎన్నార్‌ లైవ్స్ ఆన్‌` అంటూ బాలయ్యని ట్రోల్‌ చేస్తున్నారు. మరి దీనిపై బాలయ్య స్పందిస్తారా? క్షమాపణలు చెబుతాడా? అనేది చూడాలి.  కానీ ఈ లోపు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

click me!