టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
ఇదిలా ఉండగా, ఇదే తరహాలో ఇటీవల గోవాలో జరిగిన మరో గ్లామరస్ రీయూనియన్ పార్టీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సంగీత, సిమ్రన్, మహేశ్వరి, సంఘవి, కావ్య రమేశ్, ఊహ, శివ రంజని లాంటి సీనియర్ హీరోయిన్లతో పాటు దర్శకులు శంకర్, కేఎస్ రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా, అలాగే హీరోలు శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా వంటి ప్రముఖులు హాజరయ్యారు.ఆ ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ సెలబ్రిటీస్ మధ్య ఏర్పడుతున్న మైత్రీ, ఒకరికొకరు ఇచ్చే గౌరవం అభిమానులకు ఓ పండుగలా మారుతోంది.