ఇద్దరు కూతుళ్ల మధ్య నలిగిపోతున్న బాలకృష్ణ, మోక్షజ్ఞ వల్లే బాలయ్యకు ఈ పరిస్ధితి వచ్చిందా..?

First Published Jun 30, 2024, 12:00 PM IST

బాలకృష్ణకు పెద్ద సమస్య వచ్చిపడింది. అది కూడా ఎవరివల్లో కాదు.. ఆయన ఇద్దరు కూతుర్ల వల్లే పెద్ద తలనొప్పి వచ్చిందట. అది కూడా మోక్షజ్ఞ కారణంగా వీరి మధ్య పోటీ నెలకొందట. ఇంతకీ ఏ విషయంలో పోటీ పడుతున్నారో తెలుసా..? 
 

బాలయ్య బాబుకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అదేంటో అందరికి తెలిసిందే..?  స్టార్ హీరోల వారసులు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి స్టార్లు గామారి దూసుకుపోతుంటే.. 30 ఏళ్ళు దగ్గరకి వస్తున్నా.. బాలయ్య వారసుడి ఎంట్రీ జరగలేదు.  నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఏం ఆలోచిస్తున్నాడా అనేది పెద్ద మిస్టరీగా మారింది.

రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్ళి..? కొత్త బాంబ్ పేల్చిన సెలబ్రిటీ..

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం  కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా  ఎదురు చూస్తున్నారు. బాలయ్య వారసుడొస్తే.. రికార్డ్ లు సృష్టించి చేతుల్లో పెడతాం అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే.. చాలా లేట్ అయ్యింది. ఏం చేయాలా అని ప్లాన్లు వేస్తున్నాడు బాలయ్య..

ఆ పార్ట్ కు సర్జరీ చేయమంటే.. డాక్టర్ చంపేస్తా అన్నాడు.. నివేదా పేతురాజ్ సంచలన వ్యాఖ్యలు..


రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్ లో కూడా తన వారసుడి ఎంట్రీ గురించి హింట్  ఇచ్చాడు బాలయ్య. త్వరలో ఉంటుంది అన్నారు. అయిదారు కథలు కూడా రెడీగా ఉన్నాయట.  కాని మోక్షజ్ఞ జాతకం ప్రకారం వచ్చే ఏడాదిలో ముహూర్తం ఫిక్స్ చేశాడట బాలకృష్ణ.  నెక్ట్స్ ఇయర్ నందమూడి వంశం నుంచి మరో వారసుడి ఎంట్రీ ఖాయం అంటున్నారు. అయితే ఇక్కడే బాలయ్యకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందట. 

100 కోట్ల ఇంట్లో ఒంటరిగా ఉంటోన్న స్టార్ హీరోయిన్, 400 కోట్ల ఆస్తి ఉన్నా.. బ్యాచిలర్ గా మిగిలిపోయిన తార ఎవరు..?

బాలయ్య అనుకుంటే ఏ స్టార్ డైరెక్టర్ అయినా.. సై అంటూ వచ్చేస్తారు. నిర్మాతలు ఎవరైనా మేము లాంచ్ చేస్తాం అంటూ ముందుకు వస్తారు. ఆయన అడగాల్సిన అవసరమే లేదు. ఇంటిముందు క్యూ కడతారు. కాని అందులో ఎవరిని బాలయ్య సెలక్ట్ చేస్తారు అన్నదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఒకానొక టైమ్ లో బాలయ్యే డైరెక్ట్ చేస్తారని టాక్ గట్టిగా వినిపించింది. ఇక మోక్షజ్ఞ కూడా  ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. గతంలో బాగా బొద్దగా కనిపించిన మోక్షజ్ఞ... రీసెంట్ గా అల్ట్రా స్టైలిష్‌గా మారిపోయాడు. 

30 వేల కోట్ల ఆస్తి.. రజినీకాంత్ సినిమాలతో భారీగా లాభం.. దేశంలోనే రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా...?

Balakrishna - Mokshagna

అయితే ఇక్కడ బాలయ్యతో ఒక సమస్య వచ్చి పడింది. ఈ సినిమాతొ తమ తమ్ముడిని మేము లాంచ్ చేస్తామంటే మేము లాంచ్ చేస్తామంటూ.. బాలయ్య ఇద్దరు కూతుళ్ళు పోటీపడుతున్నారట. నారా బ్రాహ్మణి, తేజస్వినీ ఈ విషయంలో పోటీపడుతున్నారట. తమ్ముడి సినిమాను నేను నిర్మి్స్తానంటే.. నేను నిర్మిస్తా అని పోటీపడుతున్నారట బాలయ్య కూతుళ్ళు. 

ఇక బాలయ్య చిన్న కూతురు తేజస్వినీ రీసెంట్ గా నిర్మాత అవతారం ఎత్తింది. ముందు నుంచి ఆమెకు సినిమాలపట్ల ఆసక్తి ఉంది. దాంతో తన తమ్ముడు మోక్షజ్ఞ ను తానే లాంచ్ చేస్తానంటూ పట్టుపట్టిందట. మరోవైపు నారా బ్రహ్మణి కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని.. అది కూడా తన తమ్ముడి సినిమాతోనే ఎంట్రీ ఇస్తానని గట్టిగా వాదిస్తుందట. ఇద్దరిని సముదాయించలేక బాలయ్య తలపట్టుకునికూర్చున్నారని సమాచారం. 
 

ఇక మోక్షజ్ఞ  హీరోగా లాంచ్ చేయడానికి .. బాలయ్య ఓ ప్లాన్ వేశారట. తన సినిమాల్లో ఆల్ టైమ్ హిట్ గా.. ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిన  ఆదిత్య369  సీక్వెల్ ద్వారా తన వారసుడి ఎంట్రీ ఉంటుంది అని తెలుస్తోంది. ఈసినిమాకు  ఆదిత్య999 అనే టైటిల్ కూడా డిసైడ్ చేశారని సమాచారం. మరో వైపు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో దర్శకుల లిస్ట్ పెరుగుతోంది. పూరీ జగన్నాథ్ తో పాటు.. బోయపాటి, బాబి, అనిల్ రావిపూడి, ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి బాలయ్య చివరిగా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

click me!