ఇక ఈ సినిమాతో బాలయ్యతోపాటు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఇలా ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా ఇందులో గెస్ట్ లుగా కనిపించారు. అలా ఈ మూవీ చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి రెండో తరం హీరోలు, చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ వంటి మూడో తరం నటులు కలిసి నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు` కావడం విశేషం.