టాప్ స్టార్స్ చాలా మంది వచ్చారు. చిరంజీవి తప్ప.. ఏఎన్నార్, నాగార్జునతోపాటు వెంకటేష్, మోహన్బాబు, కే రాఘవేంద్రరావు, రామానాయుడు, అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్రెడ్డి, రాజమౌళి, శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, శ్రీహరి వంటి వారంతా పాల్గొన్నారు. రాధిక, ఆమె కూతురు, సినిమా హీరోయిన్ కార్తీక కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్కి బాలయ్య కూడా గెస్ట్ గా రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్కినేని ఫ్యామిలీతో తమకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు.