త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఆ ఇద్దరి నటన అంటే ఎంతో ఇష్టమట...

First Published Oct 19, 2024, 6:48 PM IST

దాదాపు 20 ఏళ్ళుగా హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది త్రిష. 40 ఏళ్ళువచ్చినా.. ఇంకా నాజూగ్గానే మెరిసిపోతున్న ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో చాలా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎవరి నటన అంటే ఆమెకు ఇష్టమో తెలుసా..? 
 

Trisha Krishnan

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. ఎవరైనా హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ చేస్తుంటారు. కాని త్రిష మాత్రం హీరోయిన్ గా కెరీర్ అయిపోతుంది అనుకున్న టైమ్ లో.. కాస్త గ్యాప్ ఇచ్చి.. తన సత్తా ఏంటో చూపించింది. మళ్ళీ హీరోయిన్ గానే రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతోంది త్రిష.

అమితాబ్ నోట అల్లు అర్జున్ మాట. బన్నీ గురించి బిగ్ బీ ఏమన్నారంటే..? '

 ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అంతకు మించే ఉండే అవకాశం ఉంది. ఇక కెరీర్ బిగినింగ్ లో సైడ్ క్యారెక్టర్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మ తరువాత కాలంలో  స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ భాషల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరిని కవర్ చేసింది త్రిష. 
 

Latest Videos


Trisha

తెలుగులో మహేష్, ప్రభాస్, బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, తమిళంలో అజిత్, విజయ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో జతగా కనిపించిది త్రిష. ఇక కృష్ణ, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,  , వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు, స్టాలిన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ బిజీ అయిపోయింది త్రిష. 

controversies related to heroine trisha krishnan

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఓ మూవీలో నటిస్తోంది బ్యూటీ.  తెలుగులో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో చిరు జోడీగా నటిస్తుంది . ఇదిలా ఉంటే త్రిష స్టార్ హీరోయిన్. మరి త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?  ఇండస్ట్రీలో తను ఎంతగానో  అభిమానించే  హీరోయిన్స్ ఎవరు..? ఈ విషయాన్ని గతంలో ఆమె వెల్లడించారు. ఈ కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. 

గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష..  తనకు అనుష్క, నిత్యా మీనన్, ఇవానా, సాయి పల్లవి,  అంటే ఎంతో  ఇష్టమని తెలిపింది.   త్రిష చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే... చెన్నైకి చెందిన త్రిష 1983 మే 4నపుట్టి.. కాలేజీ రోజుల్లో. మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

ఇక చిన్నగా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. సినిమాల్లోకి వచ్చింది. 1999లో మిస్ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. 2001లో, మిస్ ఇండియా పోటీలో ఆమె బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా సాధించింది. ఇక   ప్రశాంత్, సిమ్రాన్ నటించిన జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన త్రిష.. ఆతరువాత అమీర్ దర్శకత్వంలో వచ్చిన మౌనం పసితే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. 

click me!