ఇది ఆడియెన్స్ కి పెద్దట్రీట్ అనే చెప్పాలి. రెండు సినిమాలను ఒకేసారి, ఒకే చిత్రంగా విడుదల చేయడం విశేషంగా చెప్పొచ్చు. దీనిపై క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
మరి ఈ మూవీ ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి. అదే ఆదరణ దక్కితే ఇది భారీ వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది. రీ రిలీజ్కి సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఇక రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్య రాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల మరోసారి కలుసుకున్నారు. సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగానే ఈ మూవీ థియేటర్ రిలీజ్ని కన్ఫమ్ చేశారట.