ఆసుపత్రి వైద్యుడు ప్రతిత్ సమ్దాని ఈ విషయంపై మాట్లాడుతూ, ఆశా భోస్లేకు గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముందని సూచించారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఆశా భోస్లే భారతీయ సంగీత రంగంలో అత్యంత గొప్ప, బహుముఖ ప్రతిభ కలిగిన గాయకుల్లో ఒకరు. దాదాపు 70 ఏళ్లకు పైగా సాగిన ఆమె కెరీర్లో అనేక భాషల్లో, విభిన్న శైలుల్లో వేలాది పాటలు పాడారు. ఆమె గాత్రం భారతీయ సంగీతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.