కళ్యాణ్ వాళ్ళని భోజనాల దగ్గరికి తీసుకువెళ్తాడు ఈ లోపల అర్జెంట్ ఫోన్ రావటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపు రేఖ వచ్చి తిండికి మోహలు వాచిపోయినట్లుగా తింటున్నారు అంటూ అవమానిస్తుంది. రేఖతో వాదనకి దిగుతుంది అప్పు. అప్పుడే అటుగా వచ్చిన రాహుల్ విషయం తెలుసుకొని వాళ్ళు వచ్చిందే భోజనం చేయడానికి, ఇలాంటి అలగా జనంతో మాట్లాడటం మనదే తప్పు అంటూ చెల్లెల్ని అక్కడి నుంచి తీసుకుపోతాడు. ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా అంటుంది అప్పు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే అక్క బాధపడుతుంది, ఎలాగో పది నిమిషాల్లో ఫంక్షన్ అయిపోతే కావ్యకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం అని సర్దిచెప్తారు కనకం, కృష్ణమూర్తి.