అనుష్క శెట్టి నో అంటే.. త్రిష సై అన్నది.. తండ్రి పాత్రకి జోడీగా స్టార్‌ హీరోయిన్‌

First Published Mar 18, 2024, 9:42 AM IST

స్టార్‌ హీరో సినిమాకి స్వీటి అనుష్క శెట్టి నో చెప్పింది. కానీ త్రిష గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇద్దరు కలిసి డబుల్‌ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు. ఇదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. 
 

అనుష్క శెట్టి ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆమె అధిక బరువు కారణంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె నార్మల్‌ వెయిట్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ మలయాళ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిషూటింగ్‌ కూడా ప్రారంభమయ్యింది. అంతకు ముందుకు తెలుగులో `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించి హిట్‌ అందుకుంది. కొంత గ్యాప్‌తో ఈ మలయాళ మూవీకి ఒప్పుకుంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

అయితే అనుష్క.. మరో స్టార్‌ హీరో సినిమాకి నో చెప్పిందట. అదే దళపతి విజయ్‌ మూవీకి. ప్రస్తుతం విజయ్‌.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌(గోట్‌) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు విజయ్‌. అయితే తండ్రి పాత్రకి జోడీగా అనుష్క శెట్టిన సంప్రదించారట టీమ్‌. కానీ ఆమె నో చెప్పిందట. పాత్ర నిడివి కాసేపే ఉండటంతో ఆమె తిరస్కరించిందని సమాచారం. 

ఈ క్రమంలో త్రిషని అప్రోచ్‌ కాగా, ఓకే చెప్పిందని సమాచారం. ఎందుకంటే విజయ్‌, త్రిష కలిసి చివరగా `లియో` మూవీలో నటించి హిట్‌ అందుకున్నారు. ఇదే కాదు, గతంలో వీరి కాంబినేషన్‌లో `ఆది`, `గిల్లీ`, `తిరుపాచ్చి`, `కురువి` సినిమాల్లో నటించారు. హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఇప్పుడు `గోట్‌` మూవీతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. `గోట్‌`మూవీతో మరోసారి సందడి చేసేందుకు వస్తున్నారు. 
 

ఈ మూవీలో యంగ్‌ విజయ్‌కి మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెన్నైలో షూట్‌ చేస్తున్నారట. ఆ మధ్య సెట్‌ నుంచి విజయ్‌ ఫోటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే ఫస్ట్ లుక్‌ పోస్టర్లు కూడా వచ్చాయి. అవి ట్రోల్‌కి గురయ్యాయి. 

ఇదిలా ఉంటే త్రిష మళ్లీ పుంజుకుంది. ఆ మధ్య ఆమెకి సినిమాల విషయంలో గ్యాప్ వచ్చింది. మంచి కథలను ఎంచుకునే క్రమంలో బ్రేక్‌ తీసుకుంది. `పొన్నియిన్‌ సెల్వన్‌` మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. విజయ్‌తో `లియో` చేసింది. దీంతోపాటు ఇప్పుడు తెలుగులో చిరంజీవితో `విశ్వంభర`లో నటిస్తుంది. అలాగే కమల్‌ హాసన్‌తో `థగ్స్ లైఫ్‌`, అజిత్‌తో `విడాముయర్చి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మలయాళంలోనూ ఓ మూవీ చేస్తుందని టాక్‌. 
 

click me!