రామ్ పోతినేనితో సినిమా చేసిన డైరెక్టర్ అరెస్ట్ కి ఆదేశాలు ? అసలేం జరిగింది, క్లారిటీ ఇదే

Published : Dec 20, 2025, 04:16 PM IST

Director Lingusamy: తమిళంలో రన్, పందెంకోడి, పయ్యా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు లింగుస్వామిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించినట్లు వార్తలు రావడంతో, దానిపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.

PREV
14
డైరెక్టర్‌ లింగుస్వామి

తమిళంలో ఆనందం, రన్, పందెంకోడి వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన లింగుస్వామి, ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఉన్నారు. పయ్యా తర్వాత ఫామ్ కోల్పోయి, వరుస ఫ్లాపులతో వెనుకబడ్డారు. ఇటీవల ఆయన అంజాన్ సినిమా రీ-రిలీజ్‌లో ఫెయిల్ అయ్యింది.

24
చెక్ బౌన్స్ కేసు

చెక్ బౌన్స్ కేసులో లింగుస్వామి, ఆయన సోదరుడికి ఏడాది జైలు శిక్ష పడిందని వార్తలు వచ్చాయి. పేస్‌మ్యాన్ ఫైనాన్స్ సంస్థకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని తెలిసింది. దీనిపై లింగుస్వామి స్వయంగా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.

34
లింగుస్వామి విడుదల చేసిన ప్రకటన

దీనిపై లింగుస్వామి విడుదల చేసిన ప్రకటనలో, “నాపైనా, నా సంస్థపైనా పేస్‌మ్యాన్ ఫైనాన్స్ సంస్థ సెక్షన్ 138 కింద చెక్ బౌన్స్ కేసు పెట్టింది. ఈ కేసులో కోర్టు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. మేము దీన్ని చట్టపరంగా ఎదుర్కొని, మాపై పెట్టిన తప్పుడు కేసుపై అప్పీల్ చేస్తాం” అని తెలిపారు.

44
క్లారిటీ ఇదే

“మమ్మల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ అయినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మీడియా మిత్రులు ఎవరూ అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాను. మాపై వస్తున్న వదంతులు అబద్ధం” అని ఆయన పేర్కొన్నారు. దీంతో తన అరెస్ట్‌పై వస్తున్న వార్తలకు లింగుస్వామి ఫుల్‌స్టాప్ పెట్టారు. రామ్ పోతినేనితో తెలుగులో లింగుస్వామి వారియర్ నే చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది. 

Read more Photos on
click me!

Recommended Stories