అనీత్ పడ్డా 'సైయారా' సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనీత్ కాకుండా, బాలీవుడ్ లో మరికొందరు హీరోయిన్లు సక్సెస్ ఫుల్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చారు.
అనీత్ పడ్డా 'సైయారా ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలి చిత్రమే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 172 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో అనీత్ పడ్డా బాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
28
అలియా భట్ - ఫిల్మ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్
2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో అలియా భట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 59 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 109 కోట్లు వసూలు చేసింది.
38
దీపికా పదుకొనే - ఓం శాంతి ఓం
2007లో ఓం శాంతి ఓం సినిమాతో దీపికా పదుకొనే బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. షారుఖ్ సరసన దీపికా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. 35 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 149 కోట్ల బిజినెస్ చేసింది.
2008లో వచ్చిన రబ్ నే బనా ది జోడి సినిమాతో అనుష్క శర్మ నటనా రంగంలోకి అడుగుపెట్టింది.షారుఖ్ తో ఆమె జంటగా నటించిన తొలి సినిమా బ్లాక్ బస్టర్. 31 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 157 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. ఫ్యామిలీ కోసం అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.
58
అమీషా పటేల్ - కహో నా ప్యార్ హై
2000 సంవత్సరంలో కహో నా ప్యార్ హై సినిమాతో అమీషా పటేల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అమీషా తొలి సినిమా బ్లాక్ బస్టర్. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 80 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ కూడా సూపర్ హిట్.
68
అసిన్ - గజిని
బ్లాక్ బస్టర్ చిత్రం గజినితో అసిన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించింది. 2008లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ 52 కోట్లు కాగా అది 194.58 కోట్లు వసూలు చేసింది. వివాహం తర్వాత ఆసిన్ నటన మానేసింది. తెలుగులో ఆమె వెంకటేష్, పవన్, రవితేజ లాంటి హీరోలతో నటించింది.
78
ట్వింకిల్ ఖన్నా - బర్సాత్
ట్వింకిల్ ఖన్నా 1995లో బర్సాత్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 8.25 కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం 34 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ట్వింకిల్ ఖన్నాకి సరైన హిట్ పడలేదు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.
88
జాన్వీ కపూర్ – ధడక్
జాన్వీ కపూర్ 2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె మొదటి సినిమా హిట్ అయింది. 41 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 112.98 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం జాన్వీ సౌత్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. ఇప్పటికే దేవర చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం రాంచరణ్ పెద్ది చిత్రంలో నటిస్తోంది.