
ఇప్పుడంటే బుల్లితెరపై సుమ స్టార్ యాంకర్ గా వెలుగు వెలుగుతుంది కానీ.. సుమకంటే ముందు ఆ రేంజ్ లో దూసుకుపోయింది ఉదయభాను. ఆమె తెరపై కనిపిస్తే.. వన్స్ మోర్ అంటూ విజిల్స్ పడేవి. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకన్న ఉదయ భాను.. సడెన్ గా ఎందుకు కనిపించలేదు. ఆమె తెరమరుగు అవ్వడానికి కారణం ఎవరు? ఉదయ భానును ఇండస్ట్రీలో తొక్కేశారా? అవకాశాలు రాకుండా చేశారా? ఈ విషయంలో ఉదయభాను ఏమన్నారు? గతంలో ఆమె మాట్లాడిన సంచలన కామెంట్స్ సంగతేంటి?
ఒకప్పుడు టెలివిజన్ లో యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే కనిపించేది. ఆమె జోరు ఆడియన్స్ ను ఉర్రూతలూగించేది. మరీ ముఖ్యంగా వన్స్ మోర్ ప్లీజ్ అంటూ.. వేణుమాధవ్ తో కలిసి ఆమె చేసిన షో బాగా పాపుల్ అయ్యింది. ఈ షో వస్తే జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసిన ఉదయభాను.. ఆడియన్స్ లో తన మాటలతో జోష్ నింపేది.
బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఈ అందాల యాంకరమ్మ ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. వన్స్ మోర్ ప్లీజ్ తరువాత రేలా రె రేలా, ఢీ , సాహసం చేయరా డింభకా, నువ్వు నేను.. ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్తో మెప్పించిన ఆమె, కొన్ని సినిమాల్లో కూడా నటించి అలరించింది.
యాంకర్ గా మంచి ఫామ్ లో ఉండగానే ఉదయభాను సడెన్ గా కనిపించడం మానేసింది. ఒక్క కార్యక్రమంలో కూడా ఆమె కనిపించలేదు. ఎటువెళ్లింది.. ఏమయ్యిందని అభిమానులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆతరువాత సుమ, ప్రదీప్, అనసూయ, శ్రీముఖి, రష్మి, రవి, లాస్య.. ఇలా చాలామంది యాంకర్స్ బుల్లితెరను ఏలారు.
ప్రిరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, ఎందులో చూసినా వీరే కనిపించారు. ఉదయభాను మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆతరువాత దాదాపు ఐదేళ్ళకు చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మళ్లీ ఉదయభాను కనిపించడం స్టార్ట్ చేసింది. ఆమె ఇన్నాళ్లు ఎటు వెళ్లింది.. ఎందుకు కనిపించలేదు అనే ప్రశ్న మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది.
రీసెంట్ గా ఉదయభాను మళ్లీ యాక్టీవ్ అయ్యింది. టీవీ షోలు, పబ్లిక్ ఈవెంట్స్ తో పాటు.. కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించింది. అంతే కాదు తను ఇన్నాళ్లు కనిపించకపోవడంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయభాను మాట్లాడుతూ.. '' నాకు ప్రతీ కన్నీటి చుక్క విలువ తెలుసు, ప్రతీ గుండె కోత తెలుసు.. ప్రశ్నించే గళాలు ఎప్పుడు అణచివేయబడతాయి అనడానికి నేను కూడా ఒక ఉదాహరణ. నేను ముక్కుసూటిగా మాట్లాడతా.... ఉన్నది ఉన్నట్టు చెపుతా.. ఎవరిని లెక్క చేయను, పిచ్చి వేశాలు వేస్తే లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను, అందుకే నేనంటే నచ్చనివాళ్లు నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేశారు. నన్ను ఎదగకుండా తొక్కేశారు. కానీ ఎంత తొక్కితే అంత స్పీడ్ గా పైకి వస్తా. ఇన్ని రోజులు నేను ఎందుకు కనిపించలేదో తెలుసా.. గత ఐదేళ్లుగా నన్ను మీరు ఏ కార్యక్రమలో అయినా చూశారా.. ఇన్నాళ్లు నేను కనిపించకపోయినా.. మీరు మాత్రం నన్ను గుండెళ్లో పెట్టుకున్నారు. అది చాలు నాకు.. ఎవరు నన్ను ఏం చేయలేరు'' అని ఓ పబ్లిక్ ఈవెంట్ లో వెల్లడించారు. ఇక ఆతరువాత ఓ సినిమా ఈ వెంట్ లో కూడా ఉదయభానుకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది.
రీసెంట్ గా ఉదయభాను ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాతో వెండితెరమీదకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలో ఉదయభాను ఇంపార్టెంట్ రోల్ చేశారు. . ఈ సినిమాలో కట్టప్ప సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట తో పాటు మరికొందరు స్టార్స్ నటించగా.. మూవీ రిలీజ్ అయ్యి.. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ టైమ్ లో ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో ఉదయభానుకు ఓ ప్రశ్న ఎదురయ్యింది. గతంలో మీరు కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. యాంకర్స్ ను తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో అని. అది నిజమా అని అడిగారు.
దానికి ఉదయభాను సమాధానం చెపుతూ.. " అది కచ్చితంగా నిజమే అండీ.. నేను నిజమైతేనే మాట్లాడుతాను. ఈ విషయం ఏ యాంకర్ ను అడిగినా పర్సనల్ గా చెపుతారు. కాని ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉన్నారు కానీ.. ప్రతీ ఒక్కరికి తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఇది మాట్లాడటానికి సందర్భం కాదు.. సినిమా గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ '' అంటూ ఉదయభాను అన్నారు. దాంతో ఉదయభానును తొక్కెయ్యడానికి చూసింది ఎవరు అని అందరు ఆలోచనలో పడ్డారు.
ఈమధ్య కాలంలో యాంకర్స్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ, శ్రీముఖి, స్రవంతి తో పాటు ప్రదీప్, రవి, సుడిగాలి సుధీర్, ఇలా ఇంకొంతమంది యాంకర్స్ కూడా పాపులర్ అయ్యారు. వారు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే బుల్లితెరపై వీరందరికంటే ఎక్కువగా పేరు తెచ్చుకున్న ఉదయభాను మాత్రం కెరీర్ లో ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. ఒకప్పుడు ఉదయభానుకు ఉన్నఅభిమానులు, ఇమేజ్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీలు,యాంకరింగ్ ఫీల్డ్ లో వెన్నుపోట్ల వల్ల కెరీర్ దెబ్బతిన్నది. దాంతో చిన్నగా బుల్లితెరకు కూడా దూరమయ్యింది. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. అందులో రకరకాల వీడియోలతో సందడి చేస్తోంది. తన ఫ్యామిలీ, పిల్లలతో పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ, వంటల వీడియోలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవుతోంది.