యాంకర్ రష్మీ హోలీ సంబరాలు ఇలా.. పింక్ శారీలో ఫోజులు వైరల్ 

First Published Mar 25, 2024, 1:27 PM IST

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూ ఉంది. 

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదంగా ఉండేది. 

రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరించడం తో ఆ విధమైన చర్చకి కారణం అయింది. 

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరించారు. 

సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మీ ఒంటరైపోయింది అంటూ ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళు సెటైర్లు వేయడం చూస్తున్నాం. ఇప్పటికి సుడిగాలి సుధీర్ తో ముడిపెడుతూ ఆమెపై సెటైర్లు వేస్తుంటారు. 

ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. 

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాత్మక  సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ గ్లామర్ ప్రదర్శించలేదు. . 

ఇదిలా ఉండగా రష్మీ నేడు పింక్ శారీలో కలర్ఫుల్ గా మెరిసింది. రష్మీ ఇలా చీరకట్టులో ఫోజులు ఇవ్వడానికి కారణం ఉంది. నేడు హోలీ సందర్భంగా రష్మీ ఫ్యాన్స్ కి విషెస్ తెలుపుతూ ఈ ఫోజులు ఇచ్చింది

click me!