అనసూయకి షార్ట్ టైమ్ మెమొరీ లాసా?.. తనకు ఏజ్‌ అయిపోతుందంటూ షాకిచ్చిన జబర్దస్త్ మాజీ యాంకర్‌

Published : Aug 03, 2024, 11:36 PM IST

జబర్దస్త్ మాజీ యాంకర్‌, నటి అనసూయ సోషల్‌ మీడియాలో ఎలా రచ్చ చేస్తుందో తెలిసిందే. నెటిజన్లు ఆమె కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. తాజాగా వారికి అదిరిపోయే స్టఫ్‌ ఇచ్చింది.   

PREV
16
అనసూయకి షార్ట్ టైమ్ మెమొరీ లాసా?.. తనకు ఏజ్‌ అయిపోతుందంటూ షాకిచ్చిన జబర్దస్త్ మాజీ యాంకర్‌

అనసూయ వచ్చిందంటే సోషల్‌ మీడియాకి మంచి స్టఫ్‌ దొరికినట్టే. వీకెండ్స్ లో ఆమె మెరిస్తే ఇక వీకెండ్‌ ట్రీట్‌ గా భావిస్తుంటారు నెటిజన్లు. పొరపాటున ఆమె ఏదైనా కామెంట్స్ చేస్తే ఇక ఇంటర్నెట్‌ మొత్తం ఊగిపోవాల్సిందే. పెద్ద రచ్చ రచ్చ అవ్వాల్సిందే. ఇలా సందర్బం ఏదైనా అనసూయ కనిపిస్తే పండగే అని చెప్పొచ్చు.  
 

26

ఆ మధ్య ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. ఆమె ఏజ్ పై బాగా ట్రోల్‌ చేశారు. దీనికి అనసూయ కూడా గట్టిగా రియాక్ట్ అయ్యింది. అప్పుడు కూడా పెద్ద గోల అయ్యింది. అంతేకాదు ఆమె నెటిజన్లపై పోలీస్‌ కేసు కూడా పెట్టింది. అలా ఇద్దరు ముగ్గురిని జైల్లో కూడా వేసింది అనసూయ. 
 

36

ఇటీవల కొంత ఆచితూచి వ్యవహారిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ మొన్న `సింబా` ట్రైలర్‌ ఈవెంట్‌లో మరోసారి హాట్‌ కామెంట్లతో రెచ్చిపోయింది. విజయ్‌ దేవరకొండతో వివాదంపై క్లారిటీ ఇచ్చింది. మళ్లీ నెమ్మదిగా హీరోలను గెలికే ప్రయత్నం చేసింది. మొత్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తన ఏజ్‌ గురించి కామెంట్‌ చేసి షాకిచ్చింది. 
 

46

`సింబా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంది అనసూయ. ఇందులో ఆమె మాట్లాడుతూ, ఏవీ చూసుకున్నాక తాను ఇన్ని సినిమాలు చేశానా? అనే ఫీలింగ్‌ని తెచ్చిపెట్టిందని, ఎంకరేజ్‌ చేసేలా చేసిందని, మీ అభిమానం, అభినందనలే తనకు ఎంకరేజ్‌, ఉత్సాహాన్ని తెస్తుంది. మరిన్ని సినిమాలు, మంచి విలక్షణమైన పాత్రలు చేసేలా చేస్తుందని తెలిపింది అనసూయ. అలాంటి మరో పాత్రని `సింబా` సినిమాలో చేస్తున్నట్టు తెలిపింది. ఎప్పటికీ గుర్తిండిపోయే రోల్‌ అని పేర్కొంది. ఇదొకి కొత్త జోనర్‌ అని, సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్ అని చెప్పింది. ఇందులో భాగం కావడం గర్వంగా ఉందని చెప్పింది అనసూయ. 
 

56

ఈ సందర్భంగా సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి చెప్పింది అనసూయ. కొందరి పేర్లు మర్చిపోయింది. దీంతో తనకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్‌ వచ్చిందని చెప్పింది. అంతటితో ఆగలేదు. తనకు ఏజ్‌ అయిపోతుందేమో, అందుకే ఇలా మెమొరీ లాస్‌ వస్తుందని చెప్పి పెద్ద షాకిచ్చింది. సోషల్‌ మీడియాకి మంచి స్టఫ్‌ వదిలింది. అయితే దాన్ని కవర్‌ చేసుకుంటూ తనకు ఏజ్‌ అయిపోలేదని, ఇప్పటికీ అలానే ఉన్నావని చెప్పొచ్చుగా అని రిక్వెస్ట్ చేసుకోగా, సెలబ్రిటీలు, అభిమానులు ఆమె యంగ్‌గానే ఉందని ప్రశంసించడం విశేషం. 
 

66

జగపతిబాబు, అనసూయ, దివి, గాయత్రి, కస్తూరి, వశిష్ట, శ్రీనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. సంపత్‌ నంది కథ అందించి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కాబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories