విజయవాడలో అనసూయ... వదలని ట్రోలర్స్, నీ మెడలో ఎన్నాళ్లకది కనిపించిందంటూ సెటైర్స్ 

First Published Sep 3, 2022, 3:55 PM IST

ట్రోలర్స్ బాధ అనసూయను ఇప్పట్లో వదిలేలా లేదు. సోషల్ మీడియాలో ఆమెను నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. కామెంట్స్ రూపంలో ఆంటీ అంటూ చుక్కలు చూపిస్తున్నారు. 
 

Anasuya Bharadwaj


అనసూయ ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ చేసినా నెటిజెన్స్ ఇరిటేట్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఆంటీ అంటూ సోషల్ మీడియా వేధింపులకు దిగిన వారిపై అనసూయ ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారాలుగా ఇచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ భయపడ్డ సూచనలు కనిపించడం లేదు. 
 

Anasuya Bharadwaj


తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లారు. ఆ ఫోటోలు చూస్తే ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఉన్నారు. ప్రత్యేక పూజలు జరిపించడంతో పాటు గోశాలలు సందర్శించారు. తన ట్రిప్ కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ పంచుకోని అనసూయ, జస్ట్ విజయవాడ అని కామెంట్ పెట్టారు. 
 

Anasuya Bharadwaj

ఇంస్టాగ్రామ్ లో అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలపై  నెటిజెన్స్ ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. హ్యాపీ జర్నీ ఆంటీ, అంకుల్-ఆంటీ అని కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజెన్ అయితే 'నీ మెడలో ఎన్నాళ్లకు తాళిబొట్టు కనిపించింది' అని కామెంట్ పెట్టాడు. మెజారిటీ కామెంట్స్ ఆంటీ పదంతో నిండిపోయాయి. ఎంత ప్రయత్నం చేసినా వదలకుండా వేటాడుతున్న ట్రోలర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో అనసూయకు అర్థం కావడం లేదు. 
 

Anasuya Bharadwaj

కాగా ఆంటీ వివాదంలో అనసూయదే తప్పని మెజార్టీ వర్గాల అభిప్రాయం. లైగర్ ప్లాప్ సంతోషం కలిగించిందంటూ చెప్పి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఆమె గెలికారు. అమ్మను తిట్టిన కారణంగా లైగర్ ప్లాప్ అయ్యిందంటూ అనసూయ ఇండైరెక్ట్ ట్వీట్ వేసింది. అసలే డిజాస్టర్ టాక్ తో మంట మీదున్న విజయ్ ఫ్యాన్స్ పుండుపై అనసూయ కారం చల్లారు. దాంతో వాళ్ళు రెచ్చిపోయారు. 
 

లైగర్ చెత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ పడుతున్న టైం లో అనసూయ ట్వీట్ చేశారు. ఆంటీ వివాదం తెరపైకి రాగానే లైగర్ మూవీ ట్రోల్స్ పక్కదారి పట్టాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ వివాదం సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. ఏకంగా మూడు రోజులు ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు. 
 

చివరకు అనసూయను నటుడు బ్రహ్మాజీ ట్రోల్ చేయడం విశేషం. అంకుల్ అంటే కేసు పెడతా.. అని బ్రహ్మాజీ ట్వీట్ చేయగా అది అనసూయపై సెటైర్ నే అని నెటిజెన్స్ అభిప్రాయ పడ్డారు. కాగా ఐ డోంట్ కేర్ అంటూ అనసూయ ముందుకు వెళుతుంది. వివాదాల కారణంగా ఆమెకు అవకాశాలు చేజారుతున్నాయనే వార్తలు రావడం విశేషం.

click me!