నటుడు శివాజీ వివాదంలో చిక్కుకున్నారు. తన సినిమా దండోరా ప్రీ రీలీజ్ ఈ వెంట్ లో భాగంగా తన మూవీ గురించి చాలా గొప్పగా మాట్లాడిన ఆయన చివర్లో... అమ్మాయిలు, హీరోయిన్ల దుస్తుల గురించి చాలా దారుణంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సామాన్లు కనిపించేలా దుస్తులు వేసుకోకండి.. అలా వేసుకుంటే...దరిద్రపు ముండ ఇలాంటి బట్టలు వేసుకుందేంటి అని అందరూ అనుకుంటారు అని ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఆయన చేసిన కామెంట్స్ ని కొందరు మెచ్చుకుంటున్నారు. మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హీరోయిన్లపై ఉపయోగించిన పదజాలం, ఇచ్చిన సలహాలు మహిళల పట్ల ఉన్న దృక్పథాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని చాలా మంది విమర్శిస్తున్నారు. ప్రొఫెషనల్ ఈవెంట్స్ లో గౌరవం, సంయమనం లేకుండా మాట్లాడటం ఎంత వరకు సరైనది అనే చర్చ మొదలైంది. సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, హీరో మంచు మనోజ్ ఈ విషయంపై చాలా సీరియస్ గా స్పందించారు.