కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌, ఇంకా ఆసుపత్రిలోనే అభిషేక్‌!

First Published Aug 2, 2020, 5:24 PM IST

బిగ్‌ బీ కుటుంబం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐశ్వర్య రాయ్‌, ఆర్యాధలు డిశ్చార్జ్‌ కాగా తాజాగా అమితాబ్ కూడా ఈ రోజు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అమితాబ్ కుమారుడు అభిషేక్‌ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

కోట్లాది మంది అభిమానుల పూజలు ఫలించాయి. బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 77 ఏళ్ల అమితాబ్‌ దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత నెల (జూలై) 11న అమితాబ్‌ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. ఆ తరువాత రెండు రోజులుకు ఐశ్వర్య రాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ అని తేలింది.
undefined
అప్పటి నుంచి వీరు ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐశ్వర్య రాయ్‌, ఆర్యాధలు డిశ్చార్జ్‌ కాగా తాజాగా అమితాబ్ కూడా ఈ రోజు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అమితాబ్ కుమారుడు అభిషేక్‌ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
undefined
`నా తండ్రి ఈ రోజు కోవిడ్ 19 టెస్ట్ నెగెటివ్‌ వచ్చింది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మా కోసం ప్రార్థనలు చేసిన అందరికీ థ్యాంక్స్‌` అంటూ ట్వీట్ చేశాడు.
undefined
అయితే అభిషేక్‌కు మాత్రం ఇంకా నెగెటివ్‌ రాకపోవటంతో ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. `కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఇంకా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే ఆరోగ్యంగా బయటకు వస్తాను` అంటూ ట్వీట్ చేశాడు అభిషేక్‌ బచ్చన్‌.
undefined
కొద్ది రోజుల క్రితం అమితాబ్‌ కరోనా నుంచి కోలుకున్నారంటూ వార్తలు వచ్చాయి, అయితే ఆ వార్తలపై ఆయన మండిపడ్డారు. మీడియా వార్తలు రాసే సమయంలో బాధ్యతగా ఉండాలంటూ కామెంట్‌ చేశారు.
undefined
ఆ తరువాత కొంత మంది అమితాబ్‌ కరోనాతో మరణిస్తారంటూ ట్రోల్‌ చేయటంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయన తీవ్ర పదజాలంతో ట్రోలింగ్ చేసే వాళ్ల మీద మండిపడ్డారు,
undefined
click me!