వయసు 49 ఏళ్ళు, ఆంటీ పాత్రల్లో నటించను.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ డైరెక్ట్ గా చెప్పేసిందిగా 

First Published Jun 23, 2024, 8:16 PM IST

ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన అమీషా పటేల్ ఇప్పుడు బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది.

ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన అమీషా పటేల్ ఇప్పుడు బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో అమీషా పటేల్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి కూడా. 

కానీ అమీషా పటేల్ టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు అంతాగా కలసి రాలేదు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ కాలేకపోయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంది. ఇక అమీషా పటేల్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.    

Latest Videos


అమీషా పటేల్ వయసు 49 ఏళ్ళు. అయినప్పటికీ ఆమె తన ఫిజిక్ ని కాపాడుకుంటూ హాట్ గా కనిపిస్తోంది. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ అమీషా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. గత ఏడాది అమీషా పటేల్ హీరోయిన్ గా నటించిన గదర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ ధీమానో ఏమో కానీ తాజాగా అమీషా పటేల్ క్రేజీ కామెంట్స్ చేసింది. తన వయసు గురించి కూడా మరచిపోయి వ్యాఖ్యలు చేసింది. అమీషా పటేల్ మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ ఆంటీ పాత్రల్లో, తల్లి  పాత్రల్లో నటించనని తేల్చి చెప్పేసింది. 

తనకి అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్ గానే నటిస్తానని తెలిపింది. తన వయసున్న నటీమణులు చాలా మంది ఆంటీలుగా నటిస్తున్న సంగతి తనకి తెలుసు అని.. కాకపోతే ఆ పాత్రలో నటించడం తనకి ఇష్టం లేదని అమీషా పేర్కొంది. 

అమీషా పటేల్ తెలుగులో బద్రి తో పాటు.. మహేష్ బాబు నాని చిత్రంలో కూడా నటించింది. నరసింహుడు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సౌత్ లో మాత్రం ఆమెకి ఎలాంటి అవకాశాలు ప్రస్తుతం లేవు. అమీషా పటేల్ ఇంకా వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టలేదు. 

click me!